NewsOrbit
Andhra Pradesh Political News Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న

Bharat Ratna to former Prime Minister PV Narasimha Rao

Bharat Ratna: భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. అలానే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, హరిత విప్లవ నిపుణుడు ఎంఎస్ స్వామినాథన్ కు సైతం భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.కాగా, ఇటీవలే ..ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్ కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. మన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు గారిని భారతరత్న తో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు ప్రధాని మోడీ. విశిష్ట పండితుడుగా, రాజనీతిజ్ఞుడిగా భారతదేశానికి పీవీ వివిధ హోదాల్లో సేవలు అందించారని కొనియాడారు.

Bharat Ratna to former Prime Minister PV Narasimha Rao
Bharat Ratna to former Prime Minister PV Narasimha Rao

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడుగా ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయడంలో ఆయన దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించిందన్నారు. దేశాభివృద్ధికి బలమైన పునాది వేశారన్నారు.

పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందిన పీవీ నరసింహరావు మంథని నియోజకవర్గం నుండి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 1957 లో తొలి సారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72 లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన తర్వాత మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు.

Bharat Ratna to former Prime Minister PV Narasimha Rao
Bharat Ratna to former Prime Minister PV Narasimha Rao

1971లో జరిగిన పరిణామాల నేపథ్యంలో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు స్వస్తిపలికారు. 1977లో హనుమకొండ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.  1980లో జరిగిన ఎన్నికల్లో మరో సారి ఇదే నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎంపీగా ఎన్నికైయ్యారు. కేంద్ర కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 1991 లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధాన మంత్రి పదవి వరించింది. ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. బహుభాషా కోవిదుడుగా గుర్తింపు పొందారు. పీవీ నర్శింహరావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N