బుల్లితెర స్టార్ ప్రోగ్రాం బిగ్ బాస్ షో.. ఇప్పటి వరకు మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్ మాత్రం కరోనా వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో, సీజన్ 4 ఎట్టకేలకు మొదలైంది. ఇకపోతే తెలుగులో మొట్టమొదటి సారిగా 2017, జూలై 16న బిగ్ బాస్ షో ప్రారంభం కాగా.. సీజన్ 2 ఒకనెల ముందుగానే అంటూ జూన్ 10నే ప్రారంభమైంది. ఇక సీజన్ 3 మళ్లీ జూలై 21కి వెళ్లింది. కాగా సీజన్ 4 జూన్ నెలలోనే ప్రారంభించాలనే ప్రయత్నాలను కరోనా కట్టడి చేయడంతో మరింత ఆలస్యమైంది.
అయినా ఈ షో లేటుగా వచ్చినా పక్కాగా వచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించి ఉత్సాహాంగా సాగుతుంది. ఇలాంటి సమయంలో ఎన్నో కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రారంభించిన బిగ్ బాస్ 4 కు ఇప్పుడు కరోనా ఫివర్ పట్టుకుందట. తాజాగా కొందరు టెక్నీషియన్లకి కరోనా సోకడంతో ఇప్పుడంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇందులో గంగవ్వకి కరోనా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇకపోతే కొంత మంది బిగ్ బాస్ టెక్నీషియన్స్ కి కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన కారణంగా ముందు జాగ్రత్తగా హౌస్ లో ఉన్న అందరికి కూడా పరీక్షలు చేయిస్తే బాగుంటుందని భావించాటర.
ఈ తరుణంలో గంగవ్వ మాత్రమే అనారోగ్యంతో ఉండటంతో మొదట ఆమెకు మాత్రమే చేయించాలని నిర్ణయించారట ఈ షో నిర్వాహకులు.. అయితే గంగవ్వకు వచ్చే ఫలితాన్ని బట్టి మిగతా కంటెస్టెంట్స్కు కరోనా టెస్ట్లు నిర్వహించాల వద్దా అనేది నిర్ణయిస్తామని అనుకుంటున్నారట. ఇక ఈ షో ప్రారంభానికి ముందే బిగ్ బాస్లో పాల్గొనే వారందరిని కూడా రెండు వారాల పాటు క్వారెంటైన్ లో ఉండనిచ్చిన తర్వాతే షోలోకి ఎంట్రీ కానిచ్చారు. అలా అందరిని క్షుణంగా పరిశీలించిన తర్వాతే ఈ షో ప్రారంభించాం కాబట్టి వారికి కరోనా సోకే అవకాశం లేదు అంటున్నారు నిర్వాహకులు.
అయితే గంగవ్వ వయసును దృష్టిలో పెట్టుకుని ఆమె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్దితుల్లో ఇప్పుడు గంగవ్వకి పాటిజివ్ వస్తే పరిస్థితేంటి? అనే ఆందోళన ఇప్పుడు అందరిని వెంటాడుతుంది. ఇక ఏ విషయం తెలియాలంటే గంగవ్వ కరోనా టెస్ట్ రిజల్ట్ రావలసిందే.