ఢిల్లీ,జనవరి 31: హర్యానా రాష్ట్రంలోని జింద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధి కృష్ణ మిద్దా విజయం సాధించారు.
ఈ ఉప ఎన్నికలో 12000వేల ఓట్లపైగా మెజార్టీతో సమీప ప్రత్యర్ధి జననాయక్ జనతా పార్టీ అభ్యర్ధి దిగ్విజయ్ చౌతాలా పై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి మూడవ స్థానంలో నిలిచారు.
జింద్ ఎమ్మెల్యే హరి చంద్ మిద్దా మరణంతో ఈనెల 27న ఉప ఎన్నిక నిర్వహించారు. బిజెపి నుండి కృష్ణ మిద్దా పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలా, జన నాయక్ జనతా పార్టీ నుంచి దిగ్విజయ్ చౌతాలా పోటీ చేశారు.
ఓట్ల లెక్కింపులో తొలి మూడు రౌండ్లలో చౌతాలా ఆధిక్యంలో కనిపించారు. నాల్గవ రౌండ్నుండి మిద్దా ఆధిక్యంలోకి వచ్చారు.