ఆరు ఏళ్ల బాలుడు ఓ అమీబా వల్ల చనిపోయాడు. ఆ అమీబా అతడి మెదడుకు చేరుకొని మెదడును తినడం ప్రారంభించింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన యూఎస్ లోని టెక్సాస్ లో చోటు చేసుకుంది. ఆ బాలుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చగా.. ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో.. టెస్ట్ చేయగా.. అసలు విషయం బయటపడింది.
ఆ బాలుడు చనిపోయింది.. నాగ్లేరియా ఫౌలేరీ అనే సూక్ష్మజీవి వల్ల అని తేలింది. దీంతో వెంటనే ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. టెక్సాస్ గవర్నర్ కూడా రాష్ట్రంలో విపత్తును ప్రకటించారు.
ఇప్పటికే ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే యూఎస్ లో మరో మహమ్మారి రావడం ప్రపంచాన్ని కలిచివేస్తోంది. ఈ అమీబా… నీటిలో నివసిస్తుంది. మనిషి ముక్కు నుంచి శరీరంలోకి వెళ్లి.. అక్కడి నుంచి నేరుగా మెదడుకు చేరుకొని కొంచెం కొంచెంగా మెదడును తినేస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు ప్రారంభం అవుతాయి.
అది మెదడుకు చేరగానే… విపరీతమైన తలనొప్పి, వాంతులు అవుతాయి. మతిమరుపు, ఒత్తిడి, అలసట లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఈ అమీబా నల్లా నీళ్లలో, మురుగునీళ్లలో, కుంటల్లో ఉన్న నీళ్లలో ఉంటుంది. కాబట్టి.. నీటిని వేడి చేసుకొని తాగాలని.. స్నానానికి కూడా వేడి నీళ్లనే ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది.
చనిపోయిన బాలుడు కూడా కూళాయి వద్ద నీటితో ఆడుకున్న సమయంలోనే అమీబా ముక్కు ద్వారా అతడి శరీరంలోకి ప్రవేశించిందని అధికారులు గుర్తించారు.
ఈ అమీబా.. టెక్సాస్ కు ఇప్పుడే కొత్తేమీ కాదు. 1983 నుంచి 2010 మధ్యలో దీని వల్ల 28 మంది మరణించారు. మళ్లీ తాజాగా ఆ సూక్ష్మజీవి వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనాతో పాటు.. ఈ మహమ్మారితోనూ పోరాడుతామని ప్రకటించింది.