Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుండి బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారుల బృందం సోదాలు జరిపింది. సుమారు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది. సోదాల అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ఈడీ అధికారుల ప్రకటించారు. కవిత ఫోన్ లను ఈడీ అధికారుల సీజ్ చేశారు.
అయితే ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తొంది. కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ తెలిపారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా, ఎన్నికల ముందు అరెస్టులు ఏమిటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.
కవిత అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటిఆర్, హరిశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు అక్కడకు చేరుకున్నారు. అరెస్టు చేసిన కవితను ఢిల్లీకి తరలించనున్నట్లు తెలుస్తొంది. ఈడీ అధికారులు రాత్రి 8.45 ఫ్లైట్ కు టికెట్ లు బుక్ చేసినట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల ముందు కవితకు ఈడీ అధికారులు అరెస్టు చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
మరో పక్క టీఆర్ఎస్ శ్రేణులు కవిత అరెస్టును నిరసిస్తున్నారు. ఇంతకు ముందు పలు మార్లు ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేసినా విచారణకు గైర్హజరు అవుతున్నారు. నోటీసులపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్ పై ఈ నెల 19వ తేదీన విచారణ జరగనుంది. ఈ లోపుగానే ఆమెను అరెస్టు చేయడం గమనార్హం.
YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో మరో కీలక పరిణామం ..వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు