YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అవినాష్ రెడ్డికి వ్యక్తిగతంగా నోటీసు ఇచ్చింది.
పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ శుక్రవారం కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం .. కేసు తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తూ . అవినాష్ రెడ్డితో పాటు సీబీఐ, వివేకా కుమార్తె సునీతకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కేసులో వైఎస్ భాస్కరరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు 28వ తేదీకి వాయిదా వేసింది.
BRS MLC Kavitha: ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఝలక్