Bigg Boss: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఫైనల్ దశకు చేరుకుంది. ఇంకా మహా అయితే నాలుగు వారాల గేమ్ మిగిలి ఉండటంతో.. హౌస్ లో ఉన్న వారు గేమ్ చాలా సీరియస్ గా తీసుకుని ఆడుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ క్రమంలో ఈవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో కెప్టెన్ మానస్ మినహా మిగిలిన వారు నామినేషన్ కి ఎక్కడ జరిగింది. దీంతో ఈ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఉత్కంఠ భరితంగా మారింది.
పరిస్థితి ఇలా ఉంటే మొదటి నుండి హౌస్ లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ.. మానస్ సన్నీ, కాజల్ మినహా మిగతా వారిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇంటిలో చివరి కెప్టెన్సీ టాస్క్ లో… ఇంటిలో ఉన్న సభ్యులు… గెలవడం కోసం నువ్వానేనా అన్నట్టుగా తెగ పోటీ పడ్డారు. ఈ క్రమంలో సింహాసనాన్ని దక్కించుకునే పరిస్థితిలో చివరి అంకంలో క్లియర్ కట్ గా సిరి సింహాసనముపై కూర్చుంటే… సంచాలకుడిగా ఉన్న మానస్ .. పింకీ కూర్చుంది అని దబాయించి.. ఆమెకు పవర్ వచ్చేటట్లు చేశాడు. అయితే ఈ విషయంలో సిరి హౌస్ లో రచ్చ రచ్చ చేయడం జరిగింది.
చూపించిన విజువల్ లో సిరి చాలా క్లియర్ గా సింహాసనం పై కూర్చుంది. ఈ క్రమంలో మానస్ తన ఫ్రెండ్స్ నీ.. గెలిపించుకునే రీతిలో గ్రూప్ గేమ్ ఆడినట్లు అడ్డంగా దొరకటంతో సోషల్ మీడియాలో జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. గ్రూప్ గేమ్ అని హౌస్ లబోదిబోమంటు నానా హడావిడి చేసిన మానస్.. అతడు ఆడుతున్నది ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొదటి నుండి సన్నీ, కాజల్, మానస్ ఎదుటివారిపై వేలు చూపిస్తూ వాళ్లే తప్పులు చేస్తున్నారని.. మానస్ యే గ్రూప్ గేమ్ ఆడుతూ అడ్డంగా బుక్కయ్యాడు అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో ఈ సందర్భాన్ని స్లో మోషన్ లో చూపించి.. పింకీ, సిరి.. ఇద్దరిలో ఎవరు గెలిచారు అనేది ఇంటి సభ్యులే డిసైడ్ చేయాలని.. హౌస్ సభ్యులకి బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వటం.. సంచలనంగా మారింది.