NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగుసుకుంటున్న ఉచ్చు

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ పేర్కొంది. కవిత పేరును చార్జిషీట్‌లో నిందితురాలిగా చేర్చారు. 41ఏ కింద విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొంది సీబీఐ. ఈ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూప్ నుండి అరెస్టయిన నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితను నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తొంది. ఇప్పటికే ఆమెకు విచారణకు హజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

MLC Kavitha

అయితే గతంలో జారీ చేసిన నోటీసులపై కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అది విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో కవిత సీబీఐ విచారణకు ఢిల్లీకి వెళ్తారా? లేదా? అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలుమార్లు కవితను అధికారులు ప్రశ్నించారు. ఆమె గతంలో వినియోగించిన సెల్ ఫోన్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్‌ కు వచ్చిన అధికారులు కవితను ఆమె ఇంట్లోనే విచారించారు. ఈడీ అధికారులు మాత్రం రెండు సార్లు ఢిల్లీకి పిలిపించి.. విచారణ జరిపారు.

TRS MLC Kavitha

అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని.. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం, ఆమెను నిందితురాలిగా చేర్చడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలను, పలువురు లిక్కర్ వ్యాపార ప్రముఖులను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన నేపథ్యంలో కవితను అరెస్టు చేస్తారంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున ఊహగానాలు వచ్చాయి.

తాజాగా ఈ కేసులో ఆమెను నిందితుల జాబితాలో చేర్చడంతో ఉచ్చు బిగుసుకున్నట్లేననే అని అంటున్నారు. నిందితుల జాబితాలో చేర్చడంతో న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేయాల్సిందేనని, లేకపోతే అరెస్టు తప్పదని అనుకుంటున్నారు. ఈ పరిణామంతో కవిత న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్‌కి సంబంధించి ఏడో సారి నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది.  కేజ్రీవాల్‌కు ఆరుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఒక్క సారి కూడా విచారణకు హాజరుకాలేదు. దీంతో మరో సారి నోటీసులు జారీ చేశారు.

CM YS Jagan: ఒంగోలులో 20,840 ఇళ్ల స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ చేసిన సీఎం జగన్ .. చంద్రబాబుపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju