ఒక పక్క కరోనా మహమ్మారి, మరో పక్క చైనా – భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశిస్తూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఒ పక్క దేశం కరోనా మహమ్మారితో వణికిపోతున్నది. మరో పక్క చైనా భారత సరిహద్దులో వివాదాన్ని సృష్టిస్తోంది. ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు భారత సైనిక, వాయుసేన బలగాలు సరిహద్దులో మోహరించాయి. ఈ నేపథ్యంలో హోమ్ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తాము రెండు యుద్ధాలలో విజయం సాధిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఒ పక్క కరోనా సమస్య, మరో పక్క చైనా సమస్య రెండింటినీ అయన యుద్ధంగా వ్యాఖ్యానించారు.
ఇదే సందర్బంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపైనా అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ పేరు ప్రస్తావించ కుండానే ఆయనవి చిల్లర రాజకీయాలని అమిత్ షా అభివర్ణించారు. చైనా, పాకిస్తాన్ లకు మేలు చేకూరేలా అయన మాట్లాడటం మంచిది కాదని అయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని సరెండర్ మోడీగా వ్యాఖ్యానించడం చాలా తప్పని అన్నారు అమిత్ షా. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, సమావేశాల్లో చర్చలకు తాము భయపడటం లేదని అమిత్ షా పేర్కొన్నారు. 1962 నుండి ఇప్పటి వరకు అన్ని విషయాలపై చర్చించడానికి తాము సిద్ధమేనని అమిత్ షా..రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఇప్పటికే చైనా సరిహద్దులో అటు, ఇటు సైనికుల మధ్య జరిగిన వార్ లో 22 మంది భారత సైనికులు అమరులు అయిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన భారత్ యుద్దానికి సన్నద్ధం అంటూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.