టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేసినా.. ఊరికేనే చేయరని అంటారు. అంటే దానర్థం డబ్బులు తీసు కుని చేస్తారని కాదు.. చాలా వ్యూహాత్మకంగా , దూరదృష్టితో ముందుకు సాగుతారనే వాదన ఉంది. అది రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయమైనా.. మరేదైనా కూడా చంద్రబాబు నిశితంగా ఆలోచించి నిర్ణయం వ్య క్తం చేస్తారు. తాజాగా చంద్రబాబు నాయుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జాబితా విడుదల చేశారు.
అయితే.. ఈ జాబితాను పరిశీలిస్తే.. అందరూ పాత ముఖాలే.. ఓడిపోయినవారు.. గెలిచిన వారితో కలిపి ఇచ్చిన జాబితానే కనిపిస్తోంది. దీంతో పాతకాపులు.. ఓడిపోయిన వారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారనే చర్చ సాగుతోంది. అయితే. ఈ విషయంలో చంద్రబాబు ఆచి తూచి అడుగులు వేశారనే వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తే.. మొత్తంగా 94 అసెంబ్లీ సీట్లను ప్రకటిస్తే.. వాటిలో 70 స్థానాలను పాత నేతలకే అప్పగించారు.
అయితే.. దీనిలో వ్యూహం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీని అన్ని కోణాల నుంచి పరిశీలించిన ఆయన.. బలమైన జగన్ పార్టీని అంతే బలం గా ఢీ కొట్టాలనే పెద్దలక్ష్యం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇలా సీనియర్లకు అవకాశం ఇచ్చారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. సీనియర్లు అయితే.. రెండు మూడు రకాలుగా ప్రయోజనం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
ఒకటి గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతీ, రెండోది.. ఆర్థికంగా బలమైన వ్యూహాలతో ముందుకు సాగ డం, మూడు రాజకీయంగా ప్రజలకు చేరువ కావడం వంటివి కలిసి వస్తాయని చంద్రబాబు దూరదృష్టి తోనే సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని భావించవచ్చు. ఇక, వీరిలో గుమ్మడి సంధ్యారాణి, పరిటాల సునీత వంటి మహిళా సీనియర్ నాయకురాళ్లు కూడా ఉండడం గమనార్హం. కాబట్టి.. తాజా జాబితాలో 24 సీట్లు కొత్త వారికి ఇచ్చారు కాబట్టి.. మొత్తం పాత వారికే ఇచ్చారన్న విమర్శల నుంచి కూడా చంద్రబాబు ఒడ్డున పడినట్టేనని అంటున్నారు పరిశీలకులు.