భూటాన్ భూభాగం లో చైనా ప్రవేశించి ఒక గ్రామాన్ని నిర్మించింది అన్ని వస్తున్న వార్తలను భూటాన్ ఖండించింది. డోక్లామ్ పీఠభూమి సమీపంలో భూటాన్ భూభాగం లోపల చైనా 2 కిలోమీటర్ల మేర చొచ్చుకువెళ్లి గ్రామాన్ని నిర్మించిందన్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదు అన్ని తెలిపింది. ఈ మేరకు భారత భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నామ్గైల్ మాట్లాడుతూ ‘మా భూటాన్ లోపల చైనా గ్రామం లేదు అన్నే విషయాన్ని స్పష్టం చేశారు.
చైనా మీడియా సీజీటీఎన్ న్యూస్లోని సీనియర్ ప్రొడ్యూసర్గా విధులు నిర్వహిస్తోన్న షెన్ షివే ట్విట్టర్లో ‘ఇప్పుడు కొత్తగా స్థాపించబడిన పాంగ్డా గ్రామంలో శాశ్వత నివాసితులు నివసిస్తున్నారు. ఇది యాడోంగ్ కౌంటీకి దక్షిణాన 35 కిలోమీటర్ల దూరంలో లోయ వెంబడి ఉంది. డోక్లాం ప్రాంతం పరిష్కారం తరువాత ఖచ్చితమైన స్థానాన్ని సూచించింది’ అంటూ దీనికి సంబంధించిన ఫోటోలని ట్వీట్ చేశారు. అయితే, తర్వాత దాన్ని తొలగించారు. షెన్ షివే చేసిన ట్వీట్ను భారత్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు రీట్వీట్ చేశారు. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్తో శాటిలైట్ ఇమేజరీ అనలిస్ట్ నాథన్ రూసర్తో సహా అంతర్జాతీయ పరిశీలకులు షెన్ ట్వీట్లకు స్పందిస్తూ చైనా గ్రామం యొక్క స్థానం భూటాన్ సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించినట్లు సూచించింది. ‘భూటాన్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనడానికి ఇదే సాక్ష్యం’ అని తెలిపారు. ‘భారత్-చైనాల మధ్య కొనసాగిన డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందని చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన మ్యాప్ను బట్టి అర్ధమవుతుంది’ అన్నారు. అంతేకాదు, భూటాన్ భూభాగంలో రెండు కిలోమీటర్ల చొచ్చుకొచ్చినట్టు తెలియజేస్తుందని పేర్కొన్నారు. అయితే ఎన్డిటివి యాక్సెస్ చేసిన భూటాన్ ప్రభుత్వ అధికారిక ముద్రను కలిగి ఉన్న పటాలు కూడా ఈ కొత్త చైనా భూటాన్ యొక్క ప్రస్తుత దావా రేఖల్లోనే ఉందని సూచిస్తుంది అన్ని భారత్ భూటాన్ రాయబారి అన్నారు. దీని పైన నామ్గైల్ స్పందిస్తూ, ‘నేను ఆ ట్వీట్ని చూశాను. ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ అది. ఇలాంటి ఊహాగానాల గురించి నేను పట్టించుకోను’ అన్నారు. మరో వైపు చైనా భూటాన్ మధ్య సరిహద్దు విషయంలో అవగాహనకు వచ్చాయా అనే దానిపై రాయబారి “సరిహద్దు విషయాలపై వ్యాఖ్యానించడం లేదు” అని అన్నారు. అయితే సరిహద్దు చర్చలలో పాల్గొన్నాయి అన్ని, కరోనా మహమ్మారి కారణంగా ఈ చర్చలు మందగించాయి అన్ని అయినా తెలిపారు.
పాంగ్డా గ్రామం భారతదేశానికి అపారమైన సున్నితత్వం ఉన్న ప్రాంతంలో ఉంది. 2017 లో, భారతదేశం చైనా సైన్యాలు డోక్లామ్ పీఠభూమిలోని ప్రదేశంలో ఈ స్థావరానికి పశ్చిమాన కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. డోక్లాం చైనా భూభాగం అని బీజింగ్ నొక్కిచెప్పగా, ఈ ప్రాంతంపై భూటాన్ వాదనను భారత్ సమర్థించింది. భారతదేశం చారిత్రాత్మకంగా భూటాన్ యొక్క నికర-భద్రతా ప్రదాతగా ఉంది, జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై ఇరు దేశాలు పరస్పరం సహకరించుకునే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. జూన్ 30, 2017 న, భారత్ చైనా దళాల మధ్య ప్రతిష్టంభనలో, ఈ ప్రాంతంలో ట్రై-జంక్షన్ సరిహద్దు యొక్క యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడం ద్వారా బీజింగ్ 2012 ఒప్పందాన్ని ఉల్లంఘించిందని న్యూ ఢిల్లీ ఆరోపించింది. భారతదేశం, చైనా మరియు భూటాన్ మధ్య ఈ త్రి-జంక్షన్ డోక్లా పీఠభూమి యొక్క పశ్చిమ అంచున ఉన్న డోకా లా వద్ద 2017 ఫేస్ఆఫ్ సైట్కు ఉత్తరాన ఉందని న్యూ ఢిల్లీ అభిప్రాయపడింది. సరిహద్దు భూభాగాలపై కన్నేసిన చైనా వాటిని ఆక్రమిచుకోవడానికి ‘ఐదు వేళ్ల’ వ్యూహాన్ని అమలు చేస్తోది. దానిలో భాగంగా టిబెట్ని కుడి చేతి అరచేయిగా భావించగా.. లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ప్రదేశ్లని ఐదు వేళ్లలాగా భావిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను భారత్తో కలిపే సిలిగురి కారిడార్ భూటాన్కు అత్యంత సమీపంలో ఉంది. అందుకే ఈ విషయంలో భారత్ ప్రత్యేక దృష్టిపెట్టాల్సి వస్తోంది. మరి డ్రాగన్ తాజా చర్యలు ఎక్కడకు దారితీస్తాయో చూడాలి..!