హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రజలను తిరిగి స్వరాష్ట్రానికి ఆహ్వానించడానికి స్వయంగా సీఎం కేసీఆర్ గల్ఫ్ దేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని సీఎం వారిని కోరనున్నార. గల్ఫ్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, తెలంగాణలో చేసుకోవడానికి బోలెడన్ని పనులున్నాయని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. పనికి మనుషులు దొరక్క వేరే రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. దీంతో పొట్ట కూటికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వారిని రాష్ట్రానికి రప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడే నిర్మాణ రంగంలో ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. దీంతో రాష్ట్రంలోనే ఉన్న ఉపాధి అవకాశాలను వారికి సీఎం స్వయంగా వివరించనున్నారు.