NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఉద్యోగులను మునగ చెట్టు ఎక్కించేశారుగా..! సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

CM YS Jagan: ఉద్యోగులు మునగ చెట్టు ఎక్కేలా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ సహా పలు సమస్యలపై ఉద్యోగ సంఘాలు సంఘటితంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరపడం, ప్రభుత్వం ఉద్యోగ సంఘాల డిమాండ్ లపై పలు సవరణలకు అంగీకారం తెలుపడంతో ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు. పీఆర్సీ మినహా ఇతర సమస్యలపై ప్రభుత్వం నుండి సానుకూల పరిష్కారాలు లభించడంతో ఆదివారం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM YS Jagan key comments on employees issue
CM YS Jagan key comments on employees issue

 

Read more: APTF: ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఏపీటీఎఫ్.. వారి వైఖరిపై సజ్జల సంచలన కామెంట్స్..

CM YS Jagan: మీరు లేకపోతే నేను లేను

ఉద్యోగుల సహకారం ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయగలుగుతుందని సీఎం వైఎస్ జగన్అన్నారు. కోవిడ్, ఆర్ధిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు చేయగలిగినంత చేశామని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరూ భావోద్వేగానికి పోవద్దని అన్నారు. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. “నేను మనస్పూర్తిగా నమ్మెది ఒక్కటే..మీరు లేకపోతే నేను లేను” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే కమిటీ ఉందనీ, వారితో ఉద్యోగ సంఘాలు చర్చించవచ్చని చెప్పారు. మంత్రుల కమిటీ కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు. ఎవరికీ అన్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి ఉండదని జగన్ అన్నారు.

కలిసికట్టుగా పని చేసి అభివృద్ధి ఫలాలను అందరికీ అందిద్దాం

30వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అందరం కలిసికట్టుగా పని చేసి అభివృద్ధి ఫలాలను అందరికీ అందిద్దామని అన్నారు. ఎవరూ చేయనిది జగన్ చేశాడు అని అనుకోవాలంటే సీపీఎస్ రద్దు చేయడమేననీ, దానిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తామని జగన్ చెప్పారు. అందరినీ భాగస్వాములను చేసి దానిపై అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంలో రోస్టర్ పద్దతి ప్రకారం చర్యలు చేపడతామనీ, దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని జగన్ వివరించారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju