కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఘజియాబాద్ కు చెందిన రాజీవ్ త్యాగి ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా కూలబడిపోవడంతో వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజీవ్ త్యాగి మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు.
రాజీవ్ త్యాగి ఆకస్మిక మరణంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసాయి. రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీలకు అత్యంత ఆప్తుడిగా రాజీవ్ త్యాగికు పేరుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ మరణం పార్టీ శ్రేణులను కలచివేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రాజీవ్ త్యాగి మరణం నేపథ్యంలో నివాళులు అర్పించారు. రాజీవ్ త్యాగి మరణం తీరని లోటు. ఆయన బలమైన కాంగ్రెస్ వాది, నిజమైన దేశ భక్తుడు అని ట్వీట్ చేసారు.