Dalita bandhu: తెలంగాణలో ఇప్పుడు దళిత బంధు స్కీం మార్మోగిపోతోంది. అదే ఒరవడిలో ఇప్పుడు నిరుద్యోగ బంధు తెరమీదకు వచ్చింది. దళిత బంధు కింద లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కోకరి ఖాతాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పథకం పేరుతో కొత్త పథకాలను పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హుజూరాబాద్ నుండే నిరుద్యోగ బందు పథకం ప్రారంభించాలని నిరుద్యోగ జేఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ డిమాండ్ చేశారు.
Read More : KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక.. కేసీఆర్ కు ఓ గుడ్ న్యూస్… ఇంకో బ్యాడ్ న్యూస్…
నిరుద్యోగ బంధు…
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో పరామర్శించనున్న నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేఏసీ, కేయూ జేఏసి నేతలు మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకి 30 లక్షల ఆర్థిక సాయాన్ని నిరుద్యోగ బందు పథకం ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ బందు పథకం హుజూరాబాద్ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంబించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న నిరుపేద షబ్బీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా 30లక్షలు, మూడెకరాల పొలం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read More : Eatela Rajendar: ఈటలకు భలే తీపి కబురు చెప్పిన కోమటిరెడ్డి
ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.5 లక్షలు
రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ బంధు పథకం ద్వారా 5లక్షల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ డిమాండ్ చేశారు. ఇకనైనా జాప్యం చేయకుండా లక్షా 91వేల ఉద్యోగాలకి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలచేసి నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపాలని లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కి నిరుద్యోగుల ఉసురు తగలటం కాయం అని ఓయూ జెఏసి చైర్మన్ కొప్పుల ప్రతాపరెడ్డి, కేయూ జెఏసి ఛైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్, కేయూ జెఏసి అధ్యక్షులు వినోద్ లోక్ నాయక్, కెయూ జెఏసి కన్వీనర్ మేడ రంజిత్ కుమార్,కేయు జెఏసి నేతలు గజ్జల మల్లేశ్,గుజ్జుల శ్రీనివాసరెడ్డి,నల్లా ప్రవీణ్,నిరుద్యోగ జెఏసి అధికార ప్రతినిధి బండ మధు,రామిరెడ్డి లు ముఖ్యమంత్రి కెసిఆర్ కి శాపనార్థాలు పెట్టారు. ఆత్మహత్య చేసుకున్న నిరుపేద షబ్బీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా 30లక్షలు, మూడెకరాల పొలం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.