రోజు రోజుకు ఢిల్లీలో కరోనా కేసులు,వాయుకాలుష్యం పెరిగిపోతుంది. దీనితో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి నాడు టపాసులను కాల్చడం నిషేదించింది. ఢిల్లీ ప్రస్తుతం రెండు సమస్యలతో బాధపడుతుందని ఒకటి కరోనా అయితే మరొకటి వాయు కాలుష్యం అని సీఎం క్రేజీవాల్ అన్నారు. దీపావళికి టపాసులు కాల్చడం ద్వారా వాయు కాలుష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని అందుకే ప్రజలు ఎవరూ ఆ పని చేయొద్దని విజ్ఞప్తి చేసారు.
పండుగల సమయం కావడం, వాయు కాలుష్యం పెరగడం కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడానికి కారణం అని సీఎం అన్నారు. వరుసగా రెండో రోజులలో ఢిల్లీ లో కరోనా కేసులు 6000 మార్కును దాటాయి. దీనితో కరోనా పరిస్థితి పైన చీఫ్ సెక్రటరీ,హెల్త్ అధికారులుతో సమీక్ష నిర్వహించిన సీఎం,ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా విజృంభణను నివారణ లో భాగంగా ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రణాళిక చేసింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్ మరియు ఐసియు పడకలను పెంచుతున్నాము, మరణాల రేటు పెరగకుండా చూసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది అన్ని కేజ్రీవాల్ ట్విట్టర్లో తెలిపారు.
గతేడాది టపాసులు కాల్చకుండానే దీపావళి జరుపుకొన్నామని, అదే విధంగా ఈసారి కూడా జరుపుకోవాలన్నారు. వాయు కాలుష్యం, కరోనా వైరస్ నేపథ్యంలో టపాసులు కాల్చడం పిల్లల ఆరోగ్యానికి హానిచేస్తుందని హెచ్చరించారు. పొగ కారణంగా ఢిల్లీలో మరణాలు సంభవించడం ఇదే ఆఖరు ఏడాది కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కాలుష్యంతో ఢిల్లీ అల్లాడుతోందని అందుకే టపాసులు కాల్చవద్దని, తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈసారి లక్ష్మీపూజ నిర్వహిస్తామని, అందరం కలిసి దీపావళి జరుపుకొందామంటూ పిలుపునిచ్చారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీపావళి (నవంబర్ 14) రోజున రాత్రి 7.39 గంటలకు రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజలంతా తమ ఇళ్లల్లో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని వీక్షించాలని, తమ కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొనాలని కోరారు.