Earthquake: ఏపిలోని గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో భూప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7.17 గంటల నుండి 8.20 గంటల వరకూ మూడు సార్లు భూమి కంపించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యపేట, గుంటూరు జిల్లాల్లో ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూ ప్రకంపనలను ఎన్జీఆర్ఐ నిర్ధారించింది. రిక్టర్ స్కేలు పై 3గా భూకంప తీవ్రత నమోదైనట్లు ఎన్జిఆర్ఐ తెలిపింది.
పులిచింతల ప్రాంతంలో భూకంప తీవ్రత 3గా నమోదు కాగా సూర్యాపేట ప్రాంతంలో 2.3 మరియు 2.7 గా నమోదు అయినట్లు ఎన్టిఆర్ఐ శాస్త్రవేత్తలు వివరించారు. ఈ భూ ప్రకంపనల కారణంగా రెండు జిల్లాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురి అయ్యారు. గుంటూరు, సూర్యపేట ప్రాంతాల్లో గతంలోనూ స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.