Rajya Sabha Elections: ఏపి, తెలంగాణతో సహా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యుల్ విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ జారీ కానున్నది. జూన్ 10న పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏపిలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, యుపిలో అత్యధికంగా 11 సీట్లలో, ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడులో ఆరేసి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Elections 57 Rajya Sabha Seats june 10th
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏపిలో సురేష్ ప్రభు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి పదవీ కాలం జూన్ 24వ తేదీతో ముగియనుండగా, తెలంగాణలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాస్ ల పదవీ కాలం జూన్ 29 తేదీతో ముగియనుంది. చత్తీస్గడ్ లో రెండు, మధ్యప్రదేశ్ మూడు, కర్ణాటక నాలుగు, ఒడిశా మూడు, పంజాబ్ రెండు, రాజస్థాన్ నాలుగు, ఉత్తరాఖండ్ ఒకటి, బీహార్ అయిదు, హర్యానా రెండు, జార్ఖండ్ రెండు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Rajya Sabha Elections: షెడ్యుల్ వివరాలు ఇవి
- నోటిఫికేషన్ జారీ: మే 24
- నామినేషన్ల స్వీకరణ తుది గడువు: మే 31
- నామినేషన్ల పరిశీలన: జూన్ 1
- నామినేషన్ల ఉపసంహరణ తది గడువు: జూన్ 3
- పోలింగ్ తేదీ: జూన్ 10 (ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు) అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓల్ల లెక్కింపు