Romantic : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ అంటే ఒక్క పూరి జగన్నాద్ అని అందరికీ తెలిసిందే. ఆయన ఏ కథ తీయాలన్నా ధైర్యంగా తీస్తాడు. సినిమా ఆడుతుందా లేదా అనవసరం…డబ్బులొస్తాయా లేదా తర్వాత విషయం. కథ రాస్తే దాన్ని సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకు రావాల్సిందే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయిన పూరి కొడుకు తో పాటు విజయ్ దేవరకొండతోనూ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. అయితే కొడుకు సినిమాకి దర్శకత్వం మాత్రం వహించలేదు. కథ, మాటలను అందించాడు. నిర్మాతగా వ్యవహరించాడు.
మెహబూబా సినిమాతో కొడుకు ఆకాష్ పూరిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ సాధించకపోయినప్పటికీ హీరోగా మంచి లైఫ్ ఉందని మాత్రం ఆకాష్ నిరూపించుకున్నాడు. దాంతో పూరి అసోసియేట్ అని పాదూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఛార్మీతో కలిసి పూరి రొమాంటిక్ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా పోస్టర్స్ చూస్తే పక్కాగా ఇది పూరి మార్క్ సినిమా అందరూ ఫిక్సయ్యారు. అలా పోస్టర్ తో యూత్ ని బాగా ఆకట్టుకున్నారు. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయనున్నారంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Romantic : ఈ సినిమాకి ఓటీటీతో ఢీల్ కుదిరిందని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫాం లో అయినా రొమాంటిక్ సినిమాను రిలీజ్ చేయమని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారట. కేతిక శర్మ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన రొమాంటిక్ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఆ మధ్య ఈ సినిమాకి ఓటీటీతో ఢీల్ కుదిరిందని వార్తలు వచ్చాయి. కానీ అధికారకంగా మాత్రం ఎలాంటి న్యూస్ రాలేదు. ఇక థియేటర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పూరి – ఛార్మి ఈ సినిమాను నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేరుతారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి డెసిషన్ ఎలా ఉందో. కాగా విజయ్ దేవర కొండ – అనన్య పాండేలతో పూరి తీస్తున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్ షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం.