NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోదీకి సిగ్గు లేదా ? మహిళా కాంగ్రెస్ నేత తీవ్ర వ్యాఖ్యలు…

ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశం ఏదైనా ఉంది అంటే.. అది జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాలు, వాటి పర్యవసానాలు. ఇప్పుడు అందుకు సంబంధించి విశాఖలో రాజధాని శంకుస్థాపనకు మోడీని ఆహ్వానించేందుకు జగన్ ఆహ్వాన పత్రిక కూడా పంపినట్లు ప్రచారం జరుగుతోంది. మోడీని స్వయంగా వెళ్లి ఆహ్వానించేందుకు జగన్ అపాయింట్మెంట్ కోరిన విషయం కూడా కన్ఫర్మ్ అయింది. ఈ సమయంలో అమరావతి మహిళా జేఏసీ, కాంగ్రెస్ నేత, సుంకర పద్మశ్రీ కొన్ని విమర్శాత్మక కామెంట్స్ చేశారు.

 

Complaint-against-Sunkara-Padma-Shri | తెలుగు360

ఆమె మాట్లాడుతూ, “విశాఖ లో రాజధాని శంకుస్థాపన కి రావడానికి ప్రధాని మోడీ కి సిగ్గు లేదా?” అని ప్రశ్నించారు. దేశ ప్రధాని హోదాలోనే నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేశారు. మళ్లీ అదే రాష్ట్రానికి ఇంకో రాజధానికి శంకుస్థాపన చేసేందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తారని ఆమె మోదీని నిలదీశారు. ఒక రాజధాని నిర్మాణానికి తమ భూములను ఇచ్చి ఎంత ఉన్నత మనసుతో ప్రభుత్వానికి తోడ్పడిన రైతులు ఇప్పుడు అదే ప్రభుత్వం చేతిలో మోసపోయి కన్నీరు పెడుతున్నా కూడా మోడీ జగన్ ఒక వ్యక్తి మీద ఉన్న కోపంతో అమరావతిని హత్య చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతలు, ప్రధాని మోదీ విశాఖలో శంకుస్థాపన కి రావాలి అనుకుంటే… అమరావతిలో మోడీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని వాళ్ళ చేతులతోనే తీసేయాలి అని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులoటూ అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారని..ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని త్వరలో న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయన్న నమ్మకం తమకు ఉంది అని ఆమె చెప్పారు.

“అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులు పెడుతున్నారో అలాగే మన దేశానికి కూడా రెండో రాజధాని అవసరం.దేశ రాజధాని ఢిల్లీ బాగా దూరంగా ఉంది కాబట్టి , రెండో రాజధానిని దక్షిణ భారతాన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ లో రాష్ట్రపతి విడిది ఉంది. అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా !” అని పద్మ తన వాదనను వినిపించారు. మరి… రాజధాని ఏర్పాటు అంత సులువు అయిపోతే ఎవరు దేనికైనా కొత్త రాజధానిని డిమాండ్ చేయవచ్చు.. ఎక్కడైనా నిర్మించవచ్చు కదా…

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?