NewsOrbit
న్యూస్

మంత్రులకు, సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భంగపాటు!రెండేళ్లలో ఎంత తేడా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత సెగ్మెంట్ లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అమె సొంత నియోజకవర్గం మహేశ్వరంలో బీజేపీ రెండు డివిజన్లు గెలిచింది.

ఎల్బీనగర్, ముషీరాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. ఎల్బీ నగర్ లో బీజేపీ ఏకంగా క్లీన్ స్వీప్ చేసేసింది. మంత్రి తలసాని నియోజకవర్గం సనత్ నగర్ లో బీజేపీ సగం డివిజన్లను కైవసం చేసుకుంది.ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మ్ంట్ లో టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలువలేదు. అక్కడ ఉన్న11 డివిజన్లను బీజేపీ సొంతం చేసుకుంది. లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మనుషులకు టికెట్ ఇప్పించుకునేందుకు సుధీర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పార్టీ సిట్టింగ్ లకే మళ్లీ టికెట్ ఇవ్వడంతో సుధీర్ రెడ్డి అనుచరులు ఎన్నికల్లో సహకరించలేదని చర్చ జరుగుతోంది.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ విజయం సాధించింది. మంత్రి తలసాని నియోజకవర్గం సనత్ నగర్ లో 3 డివిజన్లలో బీజేపీ, 3 డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచాయి. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ముషీరాబాద్ పరిధిలో 6 డివిజన్లలో 5 డివిజన్లను బీజేపీ గెలిస్తే, ఒక్క సీటును ఎంఐఎం గెలుచుకుంది. అక్కడ టీఆర్ఎస్ బోణీ కొట్టలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తమ్ముడి భార్య సైతం ఓడిపోయింది. అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మూడు చోట్ల బీజేపీ, రెండు చోట్ల మజ్లీస్ గెలిస్తే టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో కూడా బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది.మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది.

అక్కడ బీజేపీ పట్టు సాధించే అవకాశం ఉందని గుర్తించిన టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయినా అన్ని డివిజన్లలో బీజేపీ గట్టి పోటీ  ఇచ్చింది. కొన్ని చోట్ల రెండు మూడొందల ఓట్ల తేడాతో ఓడిపోయింది.గ్రేటర్ లో బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ తన అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజార్టీ బీజేపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. అక్కడ 6 డివిజన్లలో 5 స్థానాల్లో బీజేపీ గెలిచింది. సిట్టింగ్ స్థానాన్ని మజ్లిస్ మళ్లీ గెలుచుకుంది. గతంలో ఇక్కడ టీఆర్ఎస్ కు 3 డివిజన్లు ఉంటే.. ఈసారి ఒక్క డివిజన్ కూడా దక్కలేదు. యాకత్ పురా అసెంబ్లీ పరధిలోనూ బీజేపీ రెండుచోట్ల గెలిచింది.కేవలం రెండేళ్లలోనే టీఆర్ఎస్కు హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి పరిస్థితి రావడం పట్ల రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

 

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju