చెన్నై, జనవరి 20: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.వేలూరు జిల్లా అంబూరులో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థిత విషమంగా ఉన్నట్లు సమాచారం. పోేలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వేలూరు ఇస్లామియా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.
previous post
next post