IND vs ENG : టీమిండియా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ తో ఆడుతున్న టి20 సిరీస్ లో ఇప్పటికే కోహ్లీసేన మొదటి టి20 లో ఘోరపరాభవం చవిచూసింది. ఇంగ్లాండ్ జట్టు అన్ని రంగాల్లో రాణించి భారత్ ను చిత్తు చేసింది. అయితే రెండవ టీ 20 లో కోహ్లీ అనూహ్యంగా రెండు మార్పులు చేశాడు. శిఖర్ ధావన్ ను పక్కనపెట్టి అతని స్థానంలో ఓపెనర్ ఇషాన్ కిషన్ కు చోటు ఇచ్చాడు.
గత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ కిషన్ ఆడాడు. ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో కూడా కోహ్లీ సూర్య కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఏ స్థానంలో బరిలోకి దిగుతాడు అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అదీ కాకుండా సుర్య కుమార్ కూడా ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడే కావడం విశేషం.
రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టులో ఇద్దరికి అవకాశం ఇవ్వడం అనేది ఆశ్చర్యమనే చెప్పాలి. కిషన్, సూర్య కుమార్ యాదవ్ కు బౌలింగ్ చేసిన అనుభవం ఇంగ్లాండ్ బౌలర్లకు పెద్దగా లేదు. పైగా వీరిద్దరూ పరిస్థితి తో సంబంధం లేకుండా చెలరేగిపోయి ఆడేసే ప్లేయర్లు. కాబట్టి వీరితో ఇంగ్లాండ్ బౌలర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పైగా భారత్ టాస్ గెలిచి ఈ మ్యాచ్లో చేజింగ్ తీసుకుంది. మిడిలార్డర్లో అంతా భీకర హిట్టర్లే. ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో భారత్ గెలుస్తుంది అని బెట్టింగ్ రాయుళ్ళు కూడా పందేలు వేసుకోవటం మొదలు పెట్టేసారు.