రాశీఖన్నా టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. యంగ్ హీరోలతో డీసెంట్ హిట్స్ అందుకుంది. బబ్లీ గర్ల్ గా టాలీవుడ్ లో మేకర్స్ నే కాదు యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు కమర్షియల్ యాడ్ ఫిలింస్ లో కూడా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. నెటిజన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. ఈ క్రమంలోనే విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. ఇక గోపీచంద్ తో జిల్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తొలిప్రేమ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జైలవకుశ సినిమాలతో వరసగా హిట్స్ అందుకుంది.కాని ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ తో శ్రీనివాస కళ్యాణం చేసింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడం తో రాశీఖన్నా కి ఇబ్బందులు మొదలయ్యాయి. లక్కీగా గతేడాది వెంకిమామ సినిమాలో నాగ చైతన్య కి జంటగా నటించి మంచి హిట్ అందుకుంది రాశిఖన్నా. ఇక ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు చేసింది. ఈ సినిమాలలో ఒక సినిమా సూపర్ హిట్ కాగా ఒక సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ ప్రభావం రాశీఖన్నా మీద గట్టిగా పడింది. మళ్ళీ తెలుగులో సినిమా చేసే ఛాన్స్ రాలేదు.
కాని తమిళంలో మాత్రం రాశీఖన్నా బిజీ హీరోయిన్. ప్రస్తుతం రాశీఖన్నా చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. అరణ్మనై-3, మేధావి, తుగ్లక్ దర్బార్, సైతాన్ క బచ్చా సినిమాలలోను చేస్తోంది. ఈ సినిమాలన్ని 2021లో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి. ఈ క్రమంలో రాశీఖన్నా తెలుగులో జీరో అయినా తమిళంలో మాత్రం నాలుగు సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండబోతోందని చెప్పుకుంటున్నారు. ఒకవేళ తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చినా ప్రస్తుతం రాశీఖన్నా డేట్స్ సర్దుబాటు చేసేలా లేదని అంటున్నారు.