సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందిన తర్వాత ఎక్కువ మంది నెటిజన్స్ గాని మీడియా గాని రియానే టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రియా నే ఈ కేసులో అసలు సూత్ర ధారిగా, ప్రధాన నింధితురాలు అని జనాలు కూడా అనుకుంటున్నారు. కాగా ఇలాంటి సమయంలో రియా మీడియాకు దూరంగా ఉండటం కూడా తనకి పెద్ద మైనస్ అయింది. దాంతో తన గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుకోవడం అదే ప్రచారం చేయడం చేస్తూ వస్తున్నారు.
సుశాంత్ మృతికి రియానే ప్రత్యక్షంగా.. పరోక్షంగా కారణం అన్న వార్తలు వచ్చాయి. ఈ విషయంలో అందరికీ రియానే టార్గెట్ అయింది. దాంతో ఇన్నాళ్ళు చూసి చూసి తన గురించి వస్తున్న వార్తలపై, ప్రచారాలపై మీడియా ముందుకు వచ్చి క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల ఒక జాతీయ స్థాయి మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నో ఆసక్తికర విషయాలను రియా వెల్లడించింది. తనతో పరిచయం అవ్వక ముందు నుండే సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నాడని అదే ఒక సమస్యగా తయారైందని దాంతోనే ఎక్కువగా బాధ పడుతున్నాడని తెలిపింది.
సుశాంత్ జాలీగా జీవితాన్ని గడిపేవాడని… విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేవాడని వెల్లడించింది. సుశాంత్ ను నేను ప్రేమించాను. మేమిద్దరం చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతామని అని అనుకున్నాను. కాని ఇలాంటి పరిస్థతితులు తలెత్తుతాయని ఊహించలేదని.. సుశాంత్ మృతి కి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికి అందరూ నన్నే టార్గెట్ చేస్తూన్నారు.. విలన్ లా చూసి నింధితురాలిని చేశారు. ఇలాంటి సమయంలో కూడా నా బాధ అర్థం చేసుకోకుండా ఇలా నిందించడం భావ్యం కాదంటూ వాపోయింది.
నాకు సుశాంత్ పరిచయం కాకముందు నుండే తనకి మార్జువానా(ఒక రకమైన డ్రగ్) సిగరెట్ తాగడం అలవాటు ఉంది. దాన్ని నేను మార్పించేందుకు చాలా ప్రయత్నించాను. కాని సుశాంత్ ఈ అలవాటు మానలేకపోయోవాడు. ఇక మహేష్ భట్ నాకు తండ్రి లాంటి వారు. నా కెరీర్ కు సంబంధించి వ్యక్తిగతంగా ఆయన చాలా సలహాలు, సూచనలు తీసుకున్నాను అని వెల్లడించింది. సుశాంత్ పై మీటూ ఆరోపణలు రావడం కూడా సుశాంత్ చాలా డిప్రెషన్ కు గురి చేశాయి..ఈ విషయాలన్ని నాతో పంచుకొని బాధపడే వాడని చెప్పింది. అయితే మహేష్ భట్ గురించి చెప్పిన రియా మాటలకి రివర్స్ లో తండ్రి లాంటి వారు అంటే అలాంటి ఫొటోలు దిగుతారా ..? అని కొన్ని ఫోటోస్ చూసి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.