Shyam singha roy: నేచురల్ స్టార్ నాని సినిమాలు థియేటర్స్లో వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతోంది. ఇక భారీ కమర్షియల్ హిట్ వచ్చి చాలాకాలమే అవుతోంది. అయినా నాని చేస్తున్న ప్రయోగాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. నానికి మంచి ఫాలోయింగ్ అలాగే క్లాస్ ఆడియన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. అన్నీ వర్గాల ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. నాని సినిమా అంటే నిర్మాత కూడా ఎప్పుడూ సేఫ్గా ఉంటాడు. బాక్సాఫీస్ వద్ద నాని సినిమాకు మినిమం గ్యారెంటీ అనే స్థాయిలో వసూళ్ళు వస్తుంటాయి. అందుకే నాని సినిమాలు యావరేజ్ అయినా, ఫ్లాపయినా నిర్మాతలు మాత్రం ఎప్పుడూ ఉంటారు.
ఇక గత రెండు సినిమాలు అమెజాన్ వీడియోస్లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వి సినిమా, నిన్నుకోరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన టక్ జగదీష్ నానికి హిట్స్ ఇవ్వలేకపోయాయి. ఒకరకంగా నానికి ఓటీటీ కలిసి రాలేదని కూడా టాక్ వినిపించింది. దాంతో మళ్ళీ నాని నటించిన లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్ను థియేటర్స్లో రిలీజ్ చేయాలని డిసైడయ్యారు. డిసెంబర్ 24న భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. టాక్సీవాలా సినిమాతో మంచి సక్సెస్ అందుకొని పాపులారిటీ తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
Shyam singha roy: అసలే నానీకి ఈ మధ్యకాలంలో సక్సెస్లు దక్కడం లేదు.
కెరీర్లో ఇప్పటి వరకు నాని చేయని ఓ విభిన్నమైన కథతో శ్యామ్ సింగ రాయ్ సినిమా రూపొందుతోంది. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్గా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా ఠఫ్గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి అంత ఠఫ్ స్క్రీన్ ప్లే అయితే జనాలకు సినిమా ఎక్కుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. అసలే నానీకి ఈ మధ్యకాలంలో సక్సెస్లు దక్కడం లేదు. ఇలాంటి సమయంలో ఠఫ్ స్క్రీన్ ప్లే తో ప్రయోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఓ టాక్. చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి ప్రశంసలు దక్కుతాయో.