ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరం (2024) మొదటి రోజే పీఎస్ఎల్వీ – సీ 58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ వాహన నౌక మన దేశానికి చెందిన ఎక్స్ – రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్ పోశాట్) ను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించి శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లో కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది.
ఈ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ –సీ 58 వాహన నౌక షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి అంతరిక్షంలోకి దూసుకువెళ్లనుంది. ఇది ఎక్స్ పోశాట్ ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్ 4 10 ఇతర పేలోడ్ లను హోస్ట్ చేయనుంది. భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్ – రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి ఎక్స్ పోశాట్ నాంది కానుంది.
ఇమేజింగ్, టైం – డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీ పై ప్రధానంగా దృష్టి సారించిన గతంలోని మిషన్ల మాదిరిగా కాకుండా..ఎక్స్ రే ఖగోళ శాస్త్రానికి ఒక కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్ – రే మూలాలను అన్వేషించడం ఎక్స్ పోశాట్ లక్ష్యం. ఈ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లు. పీఎస్ఎల్వీ చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది. దీనికి పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్ పెరిమెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) అని పేరు పెట్టారు.
కాగా, పీఎస్ఎల్వీ – సీ 58 ప్రయోగం నేపథ్యంలో ఇస్ర్రో శాస్త్రవేత్తలు ఇవేళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ – సీ 58,ఎక్స్ పోశాట్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
Ibrahimpatnam (NTR): మున్సిపల్ కార్మికుల సమ్మె .. ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత