ఒకానొక సమయంలో చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ వేస్తే దానిలో ఎవరైనా రాజకీయ పార్టీ నేత అయిన ప్రజలైన పడే విధంగా ఉండేవి. క్షణాలలో రాజకీయ ఫలితాలను మార్చే రీతిలో చంద్రబాబు ఆలోచనలు ఉండేవి. కానీ ప్రజెంట్ పరిస్థితి చూస్తే బాబు వేస్తున్న ఎత్తుగడలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి అన్న టాక్ బలంగా ఏపీ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల దెబ్బకు రాజకీయ చాణక్యుడు గా పేరొందిన చంద్రబాబు ప్రస్తుతం రాణించాలేని పరిస్థితిలోకి వెళ్లిపోయినట్లు టాక్ వస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి విషయంలో ప్రతిపక్షం అడ్డు పడుతుందని వైసీపీపై విమర్శలు చేసిన చంద్రబాబు… ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు మంచి చేస్తున్న గాని అడ్డుపడే పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోవడంతో సొంత పార్టీ నేతల్లోనే ఆయన పట్ల అసహనం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు జగన్ అంత మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు అని మీడియా ముందే అన్న సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా నవంబర్ మూడవ వారంలో అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలనుకుంటున్న జగన్ సర్కార్ దానికి ముందే చంద్రబాబుకి అదిరిపోయే బిగ్ షాక్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఉన్న ప్రతిపక్షాన్ని కూడా బాబుకి లేకుండా చేయటానికి జగన్ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు, ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడంతో మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలను తీసుకోవడానికి జగన్ రెడీ అయినట్లు టాక్ నడుస్తుంది. అయితే ఇద్దరు విశాఖ పట్టణ ప్రాంతానికి చెందిన గంటా శ్రీనివాసరావు, గణబాబు లని వైసిపిలో చేర్చుకోవడానికి జగన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వీరు మాత్రమే కాకుండా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా వైసీపీ లోకి రావడానికి రెడీ అయినట్లు టాక్ వినపడుతోంది. ఏది ఏమైనా ఈ సారి ఉన్న ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు లేకుండా వైసిపి గట్టిగా టిడిపి ఎమ్మెల్యేలపై కాన్సెంట్రేషన్ పెట్టినట్లు ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.