ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికార వైసిపి ఒంటరి పోరుతో ఇప్పటికే ప్రజాక్షేత్రంలో దూసుకు వెళుతుంటే అటు తెలుగుదేశం మాత్రం జనసేన, బిజెపితో కూటమికట్టి మూడు పార్టీలు కలిసి ఇటు వైసీపీని ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నాయి వాస్తవంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు రాజమండ్రిలో విలేకరుల సమావేశం పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదని తాము తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళుతున్నామని ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా జనసేన అభిమానులలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది.
పొత్తులో భాగంగా తమ పార్టీ ఏకంగా 50కు పైగా అసెంబ్లీ సీట్లతో పాటు ఏడు ఎనిమిది పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తుందని అనుకున్నారు. తీరా చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కేవలం 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలు మాత్రమే ఇచ్చారు. బిజెపితో పొత్తు కుదరక పవన్ కు మళ్లీ షాక్ తగిలింది. బిజెపి కోసం పవన్ కళ్యాణ్ మూడు అసెంబ్లీ సీట్లతో పాటు అనకాపల్లి పార్లమెంటు సీటు కూడా వదులుకోక తప్పలేదు.
ఇప్పుడు జనసేనకు కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలు మాత్రమే మిగిలాయి. జనసేన కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాలతో పాటు 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. ఇందులో ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలోని ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరిలో ఆరు – ఉమ్మడి తూర్పుగోదావరిలో 5 – ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. జనసేన పోటీ చేసే ఈ 21 సీట్లలో కూడా కొన్నిచోట్ల పార్టీకి బలహీనమైన అభ్యర్థులు ఉన్నారు.
విచిత్రమైన జనసేన బలంగా ఉన్న స్థానాలు కూడా వదులుకొని తమ పార్టీకి అంతగా పట్టులేని సీట్లలో కూడా పోటీ చేస్తున్నారు అంటే ఎంత కామెడీగా ఉందో తెలుస్తోంది. జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీకి 10 సీట్లు కూడా రావని జనసేన కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని ఇప్పుడు వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది. ఈ బెట్టింగ్ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువుగా నడుస్తుండడం చూస్తుంటే గోదావరిలో జనసేనకు షాక్ తప్పదని అర్థమవుతోంది.