Job Notification : భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ Nuclear Power Corporation Limited ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు : 200
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ Executive Trainee :
విభాగాల వారీగా ఖాళీలు :
1.మెకానికల్ : 85
2. ఎలక్ట్రికల్ : 40
3. సివిల్ : 35
4. కెమికల్ : 20
5.ఎలక్ట్రానిక్స్ :8
6.ఇన్స్ట్రుమెంటేషన్ :7
7.ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ: 5
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో బీఈ , బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2018, 2019, 2020 గేట్ కు హాజరైన అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు : 2/4 /2020నాటికి 26 సంవత్సరాలు దాటకూడదు.
ఎంపిక విధానం : 2018, 2019, 2020 గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 9/3 /2021.
వెబ్ సైట్ : npcilcareers.co.in