వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కీలక క్రతువును పూర్తి చేసింది. 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఒకటి రెండు స్థానాల్లో మినహా పెద్దగా ఎక్కడా వ్యతిరేకత లేదు. దీనిని అధిగమించేందుకు తమ్ముళ్లను లైన్లో పెట్టేందుకు చంద్ర బాబు కూడా విస్తృత కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే.. రెండు మెట్లు దిగి వచ్చైనా ఆయన తమ్ముళ్లను బుజ్జగించాలని నిర్ణయించా రు. ఈ వ్యవహారంతో పార్టీ దెబ్బతినకుండా కూడా చూస్తున్నారు.
అంతేకాదు.. టీడీపీలో ఏర్పడిన ఈ గందరగోళం లేదా.. వివాదాన్ని వైసీపీకి అనుకూలంగా మారకుండా చూసుకునేందుకు కూడా చంద్రబాబు రెడీ అయ్యారు. దీంతో చాలా వరకు నాయకులు శాంతిస్తున్నారు. ఇక్కడ మరో కీలక విషయం తెరమీదకి వస్తోంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నా యి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంచనాలు తగ్గుతున్నాయనే భావన ఏర్పడుతోంది. దీనిని గమనించిన నాయకులు టీడీపీని వీడేందుకు ఇస్టపడడం లేదు.
అయితే.. తమ మనసులోని మాటను వ్యక్త పరచడం ద్వారా భవిష్యత్తు కార్యాచరణను మాత్రం వారు పదిలం చేసుకుంటున్నారు. అంటే.. ఎవరూ కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరే పరిస్థితి లేకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అయింది. ఇది టీడీపీ సాధించిన తొలి విజయం. ఇక, రాష్ట్రంలో అధికారం విషయానికి వస్తే.. పట్టణ, నగర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో టీడీపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోందని ఒక అంచనాకు వచ్చారు.
ఇది కూడా నాయకులు సైకిల్ దిగిపోకుండా పార్టీని కాపాడుతోంది. ఈ పరిణామాలకు తోడు.. జగన్ను నమ్మలేని రాజకీయ వ్యవస్థ ఏర్పడడం కూడా.. నాయకులు జంప్ చేయకుండా అడ్డుకట్ట వేసింది. దీంతో టీడీపీని అధికారంలోకి తెచ్చుకుంటే.. ఏదొ ఒక రూపంలో తమ పరిస్థితి మెరుగు పడుతుందని.. చిన్న చిన్న పనులు.. పదవులు అయినా దక్కక పోతాయా? అనే ఆలోచన తమ్ముళ్లలో కనిపిస్తోంది. దీంతో టీడీపీ గ్రాఫ్ పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుండడం గమనార్హం. మొత్తంగా టీడీపీకి జోష్ పెరుగుతోందని, సమస్యలు కొలిక్కి వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.