Karthika Deepam Feb 11 Today Episode:
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది. గత ఎపిసోడ్ లో రుద్రాణి కార్తీక్ వాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి సారు అంటుంది.పిల్లలంటే ఇష్టం.డబ్బు,అధికారం అంటే పిచ్చితో మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టాను అంటూ క్షమాపణలు చెబుతుంది రుద్రాణి. ‘మేడమ్.. ఈ చెక్కు నాకొద్దు.. ఇక నుంచి ఈ వడ్డీ వ్యాపారం మానేస్తున్నాను’ అంటుంది సౌందర్యతో రుద్రాణి.వెరీ గుడ్ రుద్రాణీ నీలోని ఈ మార్పుకు నేను చాలా సంతోషస్తున్నాను.
AP CID: టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఏపి సీఐడీ..
Karthika Deepam Feb 11 Today Episode: రుద్రాణిలో మార్పు తెచ్చిన సౌందర్య :
ఆ చెక్ నీ దగ్గరే ఉంచుకుని వీలైతే నలుగురు అనాథపిల్లల్ని పెంచుకుని వాళ్లకి మంచి చదువు చెప్పించు’ అంటుంది సౌందర్య.అప్పటి దాకా కోటేష్ వాళ్ళ ఇంట్లోనే అనాదాశ్రమం మొదలుపెట్టండి’ అంటాడు కార్తీక్ ‘మీరు అనాథశ్రమం పెట్టమని గొప్పగా ఆలోచించారు.అలాగే మీరు నన్ను మార్చేసి వెళ్తున్నారు.మీరు బాగుండాలమ్మా..’ అంటుంది రుద్రాణి. ఇక వెళ్తూ వెళ్తూ హిమకు ముద్దు పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.సరేగాని నాన్నమ్మా.. మేము అక్కడున్నామని నీకు ఎలా తెలిసింది?’ అంటుంది హిమ.‘హోటల్ అప్పారావు ఫోన్లో మీ డాడీ ఫొటో చూశాక వివరాలు అడిగి తెలుసుకున్నా అంటుంది సౌందర్య. ఇక అంతా కలిసి హైదరాబాద్ బయలుదేరతారు. ఇంటి కాలింగ్ బెల్ మోగగా శ్రావ్య, ఆదిత్య తలుపు తీసేసరికి కార్తీక్, దీప,హిమ,సౌర్యలతో పాటు సౌందర్య, ఆనంద్ కనిపిస్తారు.
Pawan Kalyan: అదిరిపోతున్న పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” న్యూ లుక్..!!
తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టిన కార్తీక్, దీపలు :
అందరు చాలా సంతోషంగా పలకరించుకుంటారు ‘శ్రావ్యా హారతి పళ్లెం తీసుకునిరా’ అని సౌందర్య చెప్పడంతో శ్రావ్య లోపలకి వెళ్తుంది. ‘ఏం సాధించామని మమ్మీ ఇవన్నీ’ అంటాడు కార్తీక్.ఈ రోజున మనం ప్రేమలు, బంధాలు విలువ తెలుసుకున్నాం.అలాగే వాటి విలువ పిల్లలకీ తెలిసి వచ్చింది కదా.కష్టం,సుఖం,సౌకర్యాలు ఇవన్నీ నేర్పించావ్ కదరా..బడి పాఠాలు అందరూ నేర్చుకుంటారా.. కానీ బతుకు పాఠాలు కొందరే నేర్చుకోగలరు నాన్నా’ అంటుంది సౌందర్య. మొత్తానికీ శ్రావ్య వచ్చి హారతి ఇవ్వడంతో దీప, కార్తీక్ ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికి వస్తారు.
Mahesh Babu: మహేష్ బాబుకి తల్లిగా అలనాటి అందాల తార!
కధలోకి మోనిత బాబాయ్ రీ ఎంట్రీ :
మరోవైపు తాడికొండలో హోటల్ ఓనర్ భద్రం, అప్పారావు ఇద్దరూ కలిసి వెళ్తూ కార్తీక్, దీపల గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు.మరోవైపు మోనిత బస్తీలో ఉన్న తన ఇంటికి వచ్చేసరికి లక్ష్మణ్ భార్య అరుణ ఇళ్లు క్లీన్ చేస్తూ ఉంటుంది.విన్నీ లేదా అంటే ఊరు వెళ్లిందని చెబుతుంది‘ఇంతలో మోనిత బాబాయ్ కాల్ చేసి ‘అమ్మా మోనితా ఎలా ఉన్నావ్ తల్లీ’ అంటాడు. బాబాయ్ అని గుర్తుపట్టలేక ఎవరవయ్యా నువ్వు’ అంటుంది మోనిత కోపంగా ‘నేనమ్మా బాబాయ్ని ముంబాయ్ వచ్చాను.నాకు హార్ట్ ఆపరేషన్ చెయ్యాలన్నారు.నువ్వు వస్తావా అమ్మా?’ అంటాడు ప్రేమగా, రిక్వస్ట్గా దాంతో మోనిత ఏదేదే మాట్లాడి,సరే బాబాయ్ నేను వీలు చూసుకుని వస్తాను నువ్వేం భయపడకు’ అంటూ ఫోన్ పెట్టేసి ‘ఏంటి బాబాయ్ నాకు ఫోన్ చేశాడు.ఎందుకు ఇండియా వచ్చాడు అనుకుంటూ గతంలో జరిగిన ఓ సీన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. నాకెందుకులే అతడి గొడవ’ అంటూ లైట్ తీసుకుంటుంది.
Deepika Padukone: తెలుగులో ప్రభాస్ తర్వాత అతడే: దీపికా పదుకొణే
సౌర్య ఏంటి అంత మాట అనేసింది?
ఇక ఆనంద్ మాత్రం ఎంతకీ ఏడుపు ఆపకపోతే పిల్లలు వచ్చి వాడిని ‘డాడీ ఎత్తుకుంటేనే ఏడుపు ఆపుతాడు’ అంటారు. ఇంతలో కార్తీక్ వచ్చి ఎత్తుకోవడంతో వెంటనే వాడు ఏడుపు ఆపేసి నవ్వడం మొదలుపెడతాడు.దాంతో పిల్లలు ‘మేము చెప్పామా అంటూ చప్పట్లు కొడతారు.
Devatha Serial: రాధను చనిపోయానని నమ్మించిన నీకు.. మరో అబద్ధం చెప్పడం కష్టమేమీ కాదన్నా ఆదిత్య.!
ఇక మోనిత లక్ష్మణ్ని పిలిపించి కొంత డబ్బు ఇచ్చి తాడికొండ వెళ్లి కార్తీక్ ను వెతకమని చెబుతుంది.లక్ష్మణ్ డబ్బు తీసుకుని వెళ్తాడు.మరోవైపు సౌందర్య ఆనంద్తో మాట్లాడుతూ ఏంట్రా అలా చూస్తున్నావ్? నువ్వు మా ఇంటి సభ్యుడివా?’ అంటూ ఉంటే ఇంతలో సౌర్య ‘నాన్నమ్మా తమ్ముడ్ని సరిగా చూడు అచ్చం నాన్నలాగే ఉంటాడు కదా?’ అంటుంది. ఆ మాటతో అందరూ కూడా ఒకేసారి బాబుని కార్తీక్ని చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.