తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం చాటుకున్నారు. కోతులకు అరటిపండ్లు పంచారు. యాదాద్రి పర్యటనలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే… యాదాద్రి ఘాట్ రోడ్డులో రెండో మలుపు వద్ద కేసీఆర్ కోతుల గుంపును చూసారు. వెంటనే వాహనం దిగి వాటికి సీఎం కేసీఆర్ అరటిపండ్లు పంపిణీ చేసారు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని పరిశీలించడానికి వచ్చిన కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక కేసీఆర్కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అక్కడి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చి తిరిగి ప్రయాణమయ్యారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!