కేశినేని నాని ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. బెజవాడ ఎంపీగా వరుసగా రెండుసార్లు గెలిచిన నాని ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తూ ఉంటారు. అలాంటి నాని ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశారు. 2014 ఎన్నికల్లో ఫస్ట్ టైం విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్న కేశినేని చాలా వరకు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మాట ఒక్కటే దూకుడుగా ఉంటుందనే తప్పా నాని సమకాలీన రాజకీయ నేతల్లో చాలా వరకు మంచి పేరున్న నేత.
ఆ పేరే 2019 ఎన్నికల్లో అంతటి జగన్ ప్రభంజనంలోనూ నానిని వరుసగా రెండోసారి ఎంపీని చేసింది. నాని రెండోసారి ఎంపీ అయ్యాక కొన్ని విషయాల్లో పార్టీ అధిష్టానంతోనూ, చంద్రబాబుతోనూ తీవ్రంగా విబేధించారు. చివరకు బెజవాడ టీడీపీ లీడర్లు బుద్ధా వెంకన్న, బొండా ఉమా వర్సెస్ కేశినేని అన్నట్టుగా రాజకీయం నడిచింది. చివరకు బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పుడు చంద్రబాబు పర్యటిస్తే కేశినేని పక్కన ఉంటే తాము ప్రచారానికి కూడా రామని బొండా, బుద్ధా బెదిరించగా నాని చంద్రబాబు పర్యటనకు సైతం దూరంగానే ఉన్నారు.
చివరకు లోకేష్ నానికి వ్యతిరేకంగా నాని తమ్ముడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇటీవల నాని పార్టీకి దూరమవ్వడం వెంటనే కుమార్తె శ్వేతతో కలిసి వైసీపీ కండువా కప్పుకోవడం జగన్ ఈ వెంటనే నానిని వైసీపీ బెజవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత బెజవాడ పార్లమెంటు పరిధిలో చాలా మార్పులు జరిగాయి. నానితో పాటు వచ్చిన నల్లగట్ల స్వామిదాసును తిరువూరు ఇన్చార్జ్గా ప్రకటించారు.
ఆ తర్వాత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి దూరమవ్వగా అక్కడ తిరుపతిరావు యాదవ్ను ఇన్చార్జ్గా నియమించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నానికి మైలవరం అసెంబ్లీ సీటు ఇచ్చి… బెజవాడ పార్లమెంటు బరిలో గన్నవరం ఎమ్మెల్యే వంశీని రంగంలోకి దింపేలా జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వంశీకి గన్నవరంలో తీవ్రమైన యాంటీ ఉంది. పైగా వైసీపీలోనే చాలా మంది కేడర్ సహకరించే పరిస్థితి లేదు.
ఈ క్రమంలోనే వంశీని అక్కడ నుంచి తప్పించి బెజవాడ పార్లమెంటుకు పంపి… నానికి మైలవరం అసెంబ్లీ సీటు ఇస్తారని అంటున్నారు. ఒకవేళ వంశీకి అసెంబ్లీ బరిలోనే ఉంటానంటే ఖచ్చితంగా గన్నవరం నుంచి రీ ప్లేస్ చేసి మైలవరం నుంచి పోటీలో దింపుతారని టాక్ ? ఇప్పటికే చాలా మంది ప్లేసులు రీ ప్లేస్ చేస్తోన్న జగన్కు వీళ్లను మార్చడం పెద్ద టాస్క్ కాదని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.