Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో బన్నీ నటిస్తున్న ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయాలని భావించిన కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా చేస్తుండగానే అల్లు అర్జున్… కొరటాల శివ సినిమాని లైన్ లో పెట్టడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ మురుగదాస్ తో అల్లు అర్జున్ సినిమా చేయాలని రెడీ అయ్యారట.
ఇప్పటికే బన్నీకి మురుగదాస్ స్టోరీ కూడా వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు ఈ సినిమాని హోమ్ బ్యానర్.. గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు.. పాన్ ఇండియా తరహాలో సినిమా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క మురుగదాస్ తో మాత్రమే కాక కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్…తో కూడా అల్లు అర్జున్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్. దీన్ని కూడా గీతాఆర్ట్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఏది ఏమైనా ప్రస్తుతం బన్నీ ఒప్పుకుంటున్న సినిమాలు బట్టి చూస్తే సౌతిండియాలో…కీలకంగా రాణించాలి అని టాప్ డైరెక్టర్లను లైన్ లో పెడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీకి ఆల్రెడీ మలయాళంలో బీభత్సమైన క్రేజ్ ఉంది. ఈ తరుణంలో తమిళం మరియు కనడం టాప్ డైరెక్టర్లతో బన్నీ స్క్రిప్టు వినటం సౌత్ ఇండియాలో సెన్సేషనల్ గా మారింది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న “పుష్ప” షూటింగ్ చాలా సర్ వేగంగా సాగుతోంది. ఇటీవలే కరోనా బారినపడిన బన్నీ ఇటీవల కోలుకోవడం జరిగింది. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని… వెంటనే మిగతా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయాలని త్వరగానే పుష్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని… స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు.., పరిస్థితి అంత నార్మల్ అయిన వెంటనే సినిమా థియేటర్ లో రిలీజ్ చేయాలని… సినిమా యూనిట్ భావిస్తోంది.