Lakshmi Kataksham :ఉసిరి దీపం
కార్తీక మాసం అనగానే తెల్లవారు ఝామున స్నానాలు దీపారాధన, తులసి పూజ, దీపాలు (lamp) పెట్టడం వనభోజనాలు అని ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. వీటితో పాటు గా మరొక ప్రత్యేక మైన దీపం ఉసిరి దీపం. ఉసిరికాయ మీద వత్తిని పెట్టి వెలిగిస్తూ ఉంటాం. క్షీరాబ్ది ద్వాదశి పర్వదిన నాడు తులసి మొక్కతో పాటు ఉసిరి కొమ్మ పెట్టి పూజిస్తాము. ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతం లో వనభోజనాలు చేస్తాము.
Lakshmi Kataksham : శుక్రవారం రోజున
మన ఆరోగ్యానికే కాదు , పర్యావరణానికి ఎంతో మేలు చేసే వృక్షాలను దేవతా మూర్తులుగా భావించి పూజ చేయడం అనేది మన సంప్రదాయం లో ఉన్న గొప్ప విషయం. ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది ? ఉసిరి దీపాన్ని అసలు ఎప్పుడు వెలిగించాలి అనే సందేహాలు చాలా మంది కి వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. శ్రీమహావిష్ణువు (sri mahavishnuvu) తో పాటు లక్ష్మీ అమ్మవారికి ఉసిరి చాలా ప్రీతిపాత్రమైనది. ఈ ఇద్దరి అనుగ్రహం పరిపూర్ణం గా పొందాలి అంటే కార్తీక మాసం లో తప్పనిసరిగా ఉసిరి దీపం పెట్టుకోవాలి. అయితే అమ్మ వారికిప్రీతి కరమైన శుక్రవారం రోజున ఈ ఉసిరి దీపం వెలిగించడం తో శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఈ విధం గా బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు రెండు ఉసిరి దీపాలను వెలిగించడం వలన మన కోరికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా తీరుతాయి.
లక్ష్మి నారాయణుల
వరుసగా 48 రోజులపాటు బ్రహ్మ ముహూర్తంలో ఉసిరి దీపాలు వెలిగించడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తో ఆర్థిక సమస్యలు తగ్గడం తో పాటు.. అష్టైశ్వర్యాలను పొందుతారు అని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు.ఈ విధంగా 48 రోజులు పాటు బ్రహ్మ ముహూర్తంలో ఉసిరి పై నేతి దీపం వెలిగించడంకారణం గా మన ఇంట్లో సర్వ శుభాలు కలగడం తో పాటు లక్ష్మి నారాయణుల అనుగ్రహం పొందుతాము.
వారి అనుగ్రహం పొందడం వలన ఈతిబాధలు అనేవి వుండవు. ఉసిరి దీపం పెట్టిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరం తో పూజ చేసుకుంటే, స్వామి,అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మనమీద ఉంటుంది.