టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ఓపెన్ అయిపోతున్నారా? వైసీపీ నాయకుల వ్యవ హారంలో ఆయన మనసులో ఏమీ దాచుకోకుండా.. బయటకు చెప్పేస్తున్నారా. అంటే.. ఔననే విషయం అందరికీ తెలిసిందే. తన దగ్గర రెడ్బుక్ ఉందని.. అందరి పేర్లూ ఇందులో రాసుకున్నానని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ పుస్తకంలో ఏర్లు ఉన్నవారిని ఎలా ట్రీట్ చేయాలో అలానే చేస్తామని చెప్పారు. ఒక్క పార్టీ నాయకుల వ్యవహారమే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్ ల పేర్లును కూడా ఆయన చెప్పేస్తున్నారు.
కలెక్టర్ వేణు(పూర్తిపేరు కాదు), ఐపీఎస్ రెడ్డిల పేర్లు తన దగ్గర ఉన్నాయని.. తాము అధికారంలోకి వచ్చా క.. వారికి పనిష్మెంట్తప్పదని నారా లోకేష్ అంటున్నారు. ఇక, వైసీపీ నాయకుల పేర్లు కూడా ఇదే పం థాలో చెబుతున్నారు. పాపాల పెద్దిరెడ్డి, అరగంట, గంట మంత్రులు.. బొక్కుడు బొత్స.. ఇలా.. కొందరి పేర్లు కూడా ఆయన చెబుతున్నారు. అయితే.. రాజకీయంగా మనసులో ప్రత్యర్తులపైనా.. అధికారులపైనా ఎంత కసి ఉన్నా.. బయటకు మాత్రం చెప్పకూడదనేది చిన్న లాజిక్.
ఉదాహరణకు.. గత ఎన్నికలకు ముందు.. టీడీపీలోకి 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జంప్ చేశారు. దీనికి టీడీపీ నేతలు ప్రధాన కారణం కాదని.. ఓ కీలక ఐపీఎస్ కారణమని గుర్తించిన వైసీపీ అధినేత, ప్రస్తుత జగన్ ఈ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పలేదు. కానీ, తాను అధికారంలోకి సదరు ఐపీఎస్కు చుక్కలు చూపించారు ఇప్పటికీ ఆయన ఉద్యోగం లేక.. ఇంటికే పరిమితమయ్యారు. అదేవిధంగా ఓ కీలక ఐఏఎస్ వ్యవహారంలోనూ ఇలానే చేశారు.
ఇది.. ఏ నాయకుడు అయినా.. చేయాల్సిన పని. అలా కాకుండా.. అంతా ముందే బయట పడితే.. ము ఖ్యంగా ఎన్నికలకుముందుగానే.. మేం రాగానే చుక్కలు చూపిస్తాం అని చెప్పుకొంటూ.. పోతే.. వ్యతిరేక శక్తులు ఏకమయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. తెలంగాణలోనూ ఇదే జరిగింది.. మేం అధికారంలోకి వస్తే.. కేసీఆర్ను బొక్కలే వేస్తాం అన్న బీజేపీని ప్రజలు పట్టించుకోలేదు. ఇదే సమయంలో మేం అధికారంలోకి వస్తే.. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పులు సరిచేస్తామన్న రేవంత్ వాదనవైపు నిలిచారు. ఇలాంటి వ్యూహాలే ఫలిస్తాయని.. నారా లోకేష్ కొంత జాగ్రత్త పడాలని చెబుతున్నారు పరిశీలకులు.