Mamata Benerji : పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ . ఎందుకంటే, దేశంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి కాబట్టి. ఈ ఎన్నికలనుమమత బెనర్జీ ఒంటి చేత్తో ఎదుర్కుంటున్నారు కాబట్టి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నందిగ్రామ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
అదే నందిగ్రామ్ లో ప్రచారం ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఆమెపై దాడి జరిగింది. ఈ ఘటన కలకలం సృష్టించింది. అయితే, తాజాగా ఊహించని విషయం బయటపడింది.
Mamata Benerji కీ అసలేం జరిగింది?
మమత నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నందిగ్రామ్ లోని గ్రామాలకు వెళ్లారు. రియాపాడ గ్రామంలోని శివాలయం నుంచి బయటకు వస్తుండగా తనపై నలుగురైదుగురు వ్యక్తులు దాడులు చేశారని మమత ఆరోపించారు. తన పర్యటన సమయంలో అక్కడ ఒక్క పోలీస్ కూడా లేరని మమతా పేర్కొన్నారు.ఈ దాడిలో మమతకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమె తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని కోల్ కతా వెళ్లారు. మమతను గ్రీన్ ఛానల్ ద్వారా కోల్ కతాకు తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందించారు. రియపాడ వంటి ఓ చిన్న గ్రామంలో మమతా పర్యటిస్తున్న సమయంలో ఇరుకైన వీధుల్లో నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేయగా ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి.
ఆశ్చర్యపోయే నిజాలు…
మమత బెనర్జీపై జరిగిన దాడిని పరిశీలకులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ దాడికి సంబంధించిన నివేదికను ఈరోజు బెంగాల్ సీఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. మమతపై ఎలాంటి దాడి జరగలేదని ప్రత్యేక పరిశీలకు తేల్చినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రమాదవశాత్తే మమతకు గాయాలు అయ్యాయని తెలిపారు. కారు డోర్ తగలడం వలనే మమత కాలికి గాయం అయ్యిందని రిపోర్టులో పేర్కొన్నారు. మమతపై దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని రిపోర్టులో వెల్లడైంది.
ఆ నియోజకవర్గం హాట్ టాపిక్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తుండగా… ఈ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సువెందు అధికారి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఈ ప్రాంతంపై పూర్తి పట్టున్న నేతగా ఆయనకు పేరు ఉన్నది. అయితే, ఈ స్థానం నుంచే అధికారి బీజేపీ తరపున పోటీ చేస్తుండటం, సీఎం మమత ఈ స్థానం నుంచి పోటీ చేయడం అధికారి కూడా ఇక్కడి నుంచే బరిలో ఉండటంతో ఈ నియోజక వర్గంపైనే అందరి దృష్టి పడింది.