Janasena: జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లోకేషన్లలో మెగాస్టార్ చిరంజీవిని సోదరులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు కలిశారు. దాదాపు గంట పాటు అన్నదమ్ములు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్భంలో జనసేన విజయోస్తు.. విజయిభవ అని పవన్ కళ్యాణ్ ను చిరంజీవి దీవించారు. పవన్ కళ్యాణ్ కు అయిదు కోట్ల రూపాయల చెక్కును ఆంజనేయ విగ్రహం సమక్షంలో చిరంజీవి అందజేశారు. చిరంజీవి పాదాలకు పవన్ కళ్యాణ్ నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నారు.
కాగా, తమ్ముడు పవన్ కళ్యాణ్ సమాజ సేవను చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్) వేదిగా ప్రశంసించారు. ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర షూటింగ్ బిజీలో ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్, నాగబాబు లు షూటింగ్ స్పాట్ వద్దకే వెళ్లి చిరంజీవితో సమావేశమైయ్యారు.
YSRCP: మొన్న కుమార్తె .. నేడు తల్లి, సోదరుడు పార్టీకి రాజీనామా