Rajamouli Mahesh: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుంది. “బాహుబలి 2”, “RRR” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ నెలకొంది. దీంతో ఈ సినిమాని బాహుబలి 2, RRR సినిమాలకంటే హై బడ్జెట్ తో తెరకెక్కించడానికి రాజమౌళి డిసైడ్ అయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ విషయాన్ని గత ఇంటర్వ్యూలో కూడా చెప్పటం జరిగింది. దాదాపు 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో.. మహేష్ సినిమా నిర్మితం కానున్నట్లు సమాచారం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అట్లు స్క్రిప్టు ఆ తరహాలోనే ఉండబోతున్నాట్లు.. విజయేంద్రప్రసాద్ గతంలోనే తెలపడం జరిగింది. ఇటువంటి తరుణంలో సినిమాలో హీరోకి తగ్గ రీతిలో విలన్ క్యారెక్టర్ ఉంటుందని వార్తలు రావడం తెలిసిందే. అయితే సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి మొన్నటి వరకు బాలీవుడ్ హీరోలు ఆ తర్వాత కమల్ హాసన్ పేరు వినపడగా.. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ హీరో కార్తిక్ పేరు తెరపైకి వచ్చింది.
హీరో కార్తీక్.. మహేష్ కి సరిగ్గా సూట్ అవుతారని.. రాజమౌళి డిసైడ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లేకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు ఖాన్ లలో ఒకరిని తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అవతార్ నేపథ్యంలో ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ తరహాలో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో .. ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం రాజమౌళి అదేవిధంగా స్క్రిప్ట్ రైటర్ విజయేంద్రప్రసాద్ కథపై ఫోకస్ పెట్టడం జరిగింది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!