అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `నిశ్శబ్దం`. గత ఏడాది విడుదలైన `భాగమతి` తర్వాత సినిమాలకు అనుష్క దూరంగా ఉన్నారు. పెరిగిన బరువును తగ్గించుకున్నారు. అనంతరం ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా `నిశ్శబ్దం`. ఈ సినిమా ఫస్ట్ లుక్ను నేడు విడుదల చేశారు. ఈ లుక్లో ఆమె మాటలు రాని వ్యక్తి అని అయితే ఆమె పెయింటర్ అని, ఆమె మాట్లాడకపోవచ్చు కానీ.. ఆమె కళ మాట్లాడుతుందని, ఆమె పేరు సాక్షి అని రివీల్ చేశారు. మాధవన్ కూడా నటిస్తోన్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్ మైకేల్ హడ్సన్ నటిస్తున్నారు. ఇంకా షాలినిపాండే, అంజలి, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై సినిమా నిర్మితమవుతోంది.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!