Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. ఈసారి పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలలో గెలిచి పవన్ కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారని అంటున్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ తరఫున మెగా హీరోలు ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లాంటివాళ్ళు ఆఖరి నిమిషంలో ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు. అయితే ఈసారి మెగా హీరోలు కొంతమంది మాత్రమే పవన్ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే విధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ ప్రధాన హీరోలు అల్లు అర్జున్, చరణ్ ఇద్దరు కూడా ఈసారి పాల్గొనడం లేదని సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం వీరిద్దరూ పాన్ ఇండియా ప్రాజెక్టులైన సినిమాలు చేస్తున్నారు. రామ్ చరణ్ “గేమ్ చేంజర్”, అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాలతో బిజీగా ఉన్నారు. కీలకమైన టైట్ షెడ్యూల్స్ తో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితులలో బయట ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు పెట్టుకోకూడదు అని ఫిక్స్ అయ్యారు అంట. పైగా వీరిద్దరూ నటించిన సినిమాలు విడుదలయ్యి రెండు సంవత్సరాలయిపోయింది.
రామ్ చరణ్ “RRR” 2022 మార్చి నెలలో విడుదల అయింది. అల్లు అర్జున్ “పుష్ప” 2021 డిసెంబర్ నెలలో రిలీజ్ అయింది. దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. దీంతో ప్రస్తుతం చేస్తున్న షూటింగ్స్ మొత్తం కంప్లీట్ చేయాలని ఇద్దరు చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు అంట. ఏపీలో 2024 ఎన్నికలు చాలా సీరియస్ గా జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు ఉన్నాయి. 2019 కంటే ఈ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితులలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాకూడదని పవన్ ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ పరిణామాలతో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తది అన్నది ఆసక్తికరంగా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!