Naga Panchami March 18 2024 Episode 307: పంచమి ఇంకా ఏ నమ్మకంతో మోక్షం ఇక్కడే ఉంచమంటావు చెప్పు పంచమి అని మీనాక్షి అంటుంది. మోక్షాన్ని ఇదే చంపేసింది మనం ఏమైనా అంటామని మనల్ని పిచ్చి వాళ్ళని చేసి ఇక్కడికి తీసుకు వచ్చింది అని వైదేహి అంటుంది.నా మాట నమ్మండి మోక్ష బాబు బ్రతుకుతాడు తను చనిపోలేదు అని పంచమి అంటుంది. ఏ నమ్మకంతో ఇంకా నీ మాట నమ్మాలి పంచమి అని రఘు అంటాడు. రఘు పంచమి చెప్పింది అంటే మోక్ష బ్రతుకుతాడు తన మాట నేను నమ్ముతాను అని శబరి అంటుంది. అమ్మ మనం పిచ్చి వాళ్లమై పంచమి ని నమ్మి ఇక్కడికి రావడం మనం చేసిన తప్పు అని రఘు అంటాడు. మామయ్య మోక్ష బాబు బ్రతకకపోతే ఇదే శివాలయంలో నేను చచ్చిపోతాను అని పంచమి అంటుంది. కట్ చేస్తే,
కరాలి నంబూద్రిని ఆవాహన చేసుకుంటుంది. అన్నయ్య మహాకాళి కూడా నాకు శక్తులు ఇవ్వలేను అంటుంది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మోక్ష బాబు చనిపోయాడు పంచమిని వదిలిపెట్టను అన్నయ్య నాకు పనికిరాని మోక్ష పంచమికి దక్కకూడదు అని కరాలి అంటుంది. తొందరపడకు చెల్లెమ్మా ఏదైనా చేసే ముందు ఆలోచించి చెయ్యి అని నంబూద్రి అంటాడు. అలాగే అన్నయ్య ఆ పంచమి నా మీద గెలిచింది పంచమి మోక్షని బ్రతికించుకోవాలనుకుంటుంది అలా జరగనివ్వను మోక్ష లేకపోతే పంచమి ఒంటరి అయిపోతుంది మోక్షాన్ని బ్రతికించకుండా ఏదో ఒక ప్లాన్ చేస్తాను అని కరాలి అంటుంది. ఏది చేసినా ఆలోచించి చేయకరాలి లేదంటే మళ్లీ నీ పతనానికి దారి మొదలవుతుంది అని నంబూద్రి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,
నాగ లోకంలో నాగులంతా చేరి శివయ్యకు పూజ జరిపిస్తారు. ఈరోజు శివయ్యకి పూజ సంపూర్ణమైంది నాగలోకమంతా సంతోషంగా ఉంది అని నాగదేవత అంటుంది. అలాగే యువరానికి స్వాగతి ఏర్పాట్లు చేస్తే మంచిది మాత అని ఫణీంద్ర అంటాడు. మీకందరికీ ఒక విషయం చెప్పదలచాను మన యువరాణి నాగులోకానికి రాబోతుంది తనకు పట్టాభిషేకం ఏర్పాట్లు చేయాలి ఈ నాగలోకానికి అంతా మంచే జరుగుతుంది అని నాగదేవత చెబుతుంది. చాలా సంతోషకరమైన శుభవార్త చెప్పారు మాత అని అందరూ ఆశీర్వదిస్తారు. ఫణీంద్ర ఈ గణతంత్ర నీకే దక్కుతుంది త్వరగా వెళ్లి యువరాణి ని తీసుకురా అని నాగదేవత చెబుతుంది. అలాగే మాత తక్షణమే వెళ్లి పంచమిని నాగులోకానికి తీసుకువస్తానుఅని ఫణీంద్ర వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,
పంచమి గుడిలో విశ్రమిస్తుంది. వైదేహి పంచమి దగ్గరికి వెళ్లి పంచమి ఇంకా ఎందుకే నాటకాలు ఆడుతున్నావు నా కొడుకు చనిపోయాడు చెప్పు అసలు మీ మధ్య ఏం జరిగింది తను ఎందుకు ఇలా పడి ఉన్నాడు అని వైదేహి అంటుంది. వైదేహి పంచమిని నమ్మి మనం తప్పు చేశాం ఇక్కడ మనం ఉండకూడదు వెళ్లిపోదాం పద అని రఘు అంటాడు. నా కొడుకుని చంపిన ఈ పంచమిని వదిలిపెట్టను జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను అని వైదేహి అంటుంది. మామయ్య ఈ ఒక్కరోజు నా మీద నమ్మకం ఉంచండి శివయ్య మోక్ష బాబుని బ్రతికిస్తాడు అని పంచమి అంటుంది.రఘు ఆవేశ పడకు రా పంచమి చెప్పింది అంటే అది కచ్చితంగా జరిగి తీరుతుంది అని శబరి అంటుంది.ఇంకా ఏ నమ్మకంతో ఇక్కడే ఉంచమంటావమ్మా మనం అందరం పంచమి ని నమ్మి ఇక్కడికి రావడం మనం చేసిన తప్పు ఎవరైనా చూస్తే నవ్విపోతారు మంత్రాలకి చింతకాయలు రాలుతాయా మోక్షని తీసుకొని వెళ్దాం పద వైదేహి అని రఘు అంటాడు.
పంచమి ఆ రోజు ఏం జరిగిందో చెప్పమ్మా మోక్షని పెద్ద హాస్పిటల్ కైనా తీసుకువెళ్దాం అని మీనాక్షి అంటుంది. దీన్ని బ్రతకనివ్వను చంపేస్తాను నా చేతులతోటే అని వైదేహి అంటుంది. మోక్షని తీసుకుని వెళ్ళిపోదామని రఘు సిద్ధపడతాడు. పంచమి మోక్ష దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో నాగ సాధు హరహర మహాదేవ శంభో శంకర అంటూ అక్కడికి వస్తాడు. మోక్షా నుదుట బొటనవేలు పెట్టి చూసి మోక్ష చనిపోలేదు బ్రతికే ఉన్నాడు పంచమి చెప్పిన మాట సత్యం అని అంటాడు. అయితే హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి అని రఘు అంటాడు. మోక్షని ఏ హాస్పిటల్ బ్రతికించలేవు కేవలం పంచమి బ్రతికించగలదు అని నాగ సాధువు అంటాడు. స్వామి మోక్ష బాబు బ్రతకడానికి నేనేం చేయాలో చెప్పండి నా ప్రాణమైన ఇస్తాను అని పంచమి అంటుంది.
పంచమి నువ్వు శివయ్య బిడ్డవి శివయ్య అనుగ్రహం ఎప్పటికీ నీకు ఉంటుంది శివయ్య ని మాంగల్యాన్ని కాపాడుతాడు అధైర్య పడకు అని నాగ సాధువు అంటాడు. నీ ప్రేమే నీ భర్తని రక్షిస్తుంది పంచమి నువ్వు ధైర్యంగా ఉండు పంచమి అని నాగ సాధువు అంటాడు.ఏం చేయమంటారు చెప్పండి స్వామి అని పంచమి అంటుంది. ఒక యాగం జరిపిద్దాం అని సిద్ధం చేయండి అందుకు నెయ్యి కట్టలు ఉంటే చాలు అని నాగసాధు అంటాడు. అన్ని సిద్ధంగానే ఉన్నాయి అని గుడిలో పూజారి గారు అంటారు. మోక్షాని ఇక్కడే ఉండనివ్వండి యాగం జరిగేంతసేపు శివనామస్మరణ చేయండి యాగం పూర్తయ్యేలోపు మోక్ష బ్రతికితే నీ అదృష్టం లేదంటే శివయ్య అనుగ్రహం నీ పైన లేనట్టే పంచమి అని నాగ సాధువు అంటాడు..