Dhanush-Aishwarya: సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, స్టార్ హీరో ధనుష్లు ఇటీవలె తమ వైవాహిక బంధానికి స్వస్థ పలికిన సంగతి తెలిసిందే. కోలీవుడ్లో స్టార్ కపుల్గా గుర్తింపు పొందిన ఈ జంట 2004లో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు జన్మించారు. దాదాపు 18 ఏళ్లు ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. ఇప్పుడు విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ముఖ్యంగా అభిమానులు ఎంతగానో బాధ పడ్డారు. మళ్లీ వీరిద్దరూ కలిస్తే చూడాలని ఆశపడుతున్నారు. మరోవైపు వీరి కాపురాన్ని చక్కదిద్దేందుకు సూపర్స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయిందట. ధనుష్, ఐశ్వర్యలు విడిపోవాలని బలంగా నిశ్చయించుకున్నారని.. అందుకే ఎవరెన్ని చెప్పినా మనసు మార్చుకోవడం లేదని తెలుస్తోంది.
అయితే విడిపోయినా ధనుష్- ఐశ్వర్యలు కొన్నాళ్ల పాటు కలిసే ఉండబోతున్నారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. అందుకు కారణం వారి కుమారులు యాత్ర, లాంగానే అని తెలుస్తోంది. పిల్లలు పెద్ద వారు అయ్యి ఉన్నత చదువులకు వెళ్లే వరకు ఈ జంట కలిసి ఉండాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
కాగా, ధనుష్ సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే ఈయన టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ధనుష్ తెలుగుతో చేస్తున్న తొలి చిత్రం `సార్`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!