NTR Priyamani: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిపోవడం జరిగింది. RRR తో తారక్ ఇమేజ్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా.. విస్తరించింది. పరిస్థితి ఇలా ఉంటే ప్రజెంట్ తారక్ దర్శకుడు కొరటాల శివతో “దేవర” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. దీంతో ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నరు. అయితే ఈ సినిమాకి సంబంధించి సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరన్ అవుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా హీరోయిన్ ప్రియమణి నటిస్తున్నారు. ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ విని అసహనం చెందుతున్నారు.
అయితే “దేవర” సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. అయితే తండ్రి పాత్రకి సంబంధించి ఎన్టీఆర్ కి జోడిగా ప్రియమణి నటిస్తుందట. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ భార్య నటించడంతో కొడుకుగా ఉన్న ఎన్టీఆర్ పాత్రకు ప్రియమణి తల్లిగా నటిస్తుందని తెలుస్తోంది. ఈ వార్తతో కూడా హర్ట్ అవుతున్నారు.
కానీ ఇంకా ఏ మాత్రం గ్లామర్ తగ్గని ప్రియమణి… అప్పుడే తారక్ తల్లి పాత్ర పోషించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో 2007వ సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన “యమదొంగ” ఎన్టీఆర్ కి జోడిగా ప్రియమణి నటించింది. ఎన్టీఆర్ కి ఆ సమయంలో యమదొంగ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాల తర్వాత.. ఎన్టీఆర్ తో ప్రియమణి నటించడానికి సిద్ధమైనట్లు వార్తలు రావటం సంచలనంగా మారింది. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా జాహ్నవి కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కాబోతోంది.