Dhanush: సాధారణంగా ప్రస్తుతం ఉన్న సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఎంత ప్రేమతో పెళ్లి చేసుకున్నప్పటికీ కొంతకాలం మాత్రమే కలిసి ఉంటున్నారు. పిల్లల పుట్టిన అనంతరం కూడా ఏవో కలహాలతో విడిపోతూ తమ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు. ఇక ఈ కోవా కి చెందిన వారే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య మరియు హీరో ధనుష్. ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చిన అనంతరం విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇక ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య మరియు రజనీకాంత్ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా రిలీజ్ అయింది. విష్ణు విశాల్ మరియు శ్రీకాంత్ ముఖ్య పాత్రలలో నటించిన ” లాల్ సలాం ” మూవీ నేడు థియేటర్లలో విడుదలు అయింది. గతంలో ధనుష్ నటించిన త్రీ సినిమాతో దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఐశ్వర్య.
ఇక పెళ్లి అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరమైనా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత లాల్ సలాం సినిమాతో మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మరియు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. ఇక నేడు ఈ సినిమా తమిళ్ మరియు తెలుగు భాషల్లో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ఇక ప్రస్తుతం ధనుష్ మరియు ఐశ్వర్య విడివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య ఎన్నో అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ ఐశ్వర్య కోసం ధనుష్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. లాల్ సలాం మూవీ విడుదలకు ముందు ఓ పోస్ట్ షేర్ చేస్తూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశాడు. ఇక వాళ్లు విడిపోయినప్పటికీ ఇంత కేరింగ్ తో తన ట్విట్టర్ వేదికగా ఆ సినిమాని ప్రమోట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ధనుష్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!