యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రం రూపొందడానికి ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా వైజయంతి మూవీస్ కి 50 వ సినిమా కావడం విశేషం. అందుకే ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 400 కోట్ల తో పాన్ ఇండియా సినిమాగా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేసే విధంగా దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపక పదుకొణె నటిస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని హాలీవుడ్ స్థాయిలో సినిమాని రూపొంచనున్నారని అందుకోసం ఎక్కువగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారని సమాచారం. అంతేకాదు హాలీవుడ్ లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇదే గనక నిజమైతే టాలీవుడ్ హీరో నటించిన సినిమా హాలీవుడ్ లో రిలీజ్ కావడం ప్రభాస్ సినిమానే అవుతుంది. మరి ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో వెలువడనుందని ఈ సినిమాలో నటించే మిగతా నటీ నటులు..ఇతర టెక్నీషియన్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని సమాచారం.
ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి రాధే శ్యాం అన్న టైటిల్ పరిశీలనలో ఉండగా పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ కి సిస్టర్ గా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందని సమాచారం. యువి క్రియోషన్స్ లో వంశీ ప్రమోద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా గోపీకృష్ణ మూవీస్ సంస్థ లో ప్రభాస్ పెదనాన్న సీనియర్ నటులు కృష్ణం రాజు సమర్పిస్తున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!