Hyper Aadi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది నెలలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికలు వాతావరణం పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ఒంటరిగా పోటీ చేయబోతుంది. ఇదే సమయంలో టీడీపీ… జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు పలు పార్టీలలో జాయిన్ అవుతారు. కాగా ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమని ప్రకటన చేయడం జరిగింది.
గతంలో పలుమార్లు జనసేన పార్టీ కార్యక్రమాలలో ప్రసంగాలు చేశారు. నాకు ఈ రకమైన గుర్తింపు తీసుకొచ్చింది జబర్దస్త్ షో. ఆ కార్యక్రమంలో నాగబాబు మాదిరిగానే రోజా గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆమెతో నాకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలు నచ్చి పవన్ తో కలిసి రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎవరిని దూషించరు. సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతారు. కాగా అటువంటిది ఆయనను ఎవరైనా విమర్శిస్తే తాను ఈసారి నుండి స్పందించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు హైపర్ ఆది వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా పోటీ చేస్తానని తెలిపాడు. పవన్ను గెలిపించడం కోసం తాను గెలుస్తానని పేర్కొన్నాడు. ఈసారి కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని హైపర్ ఆది వివరించాడు. ఇటీవల కొద్ది రోజుల క్రితం జానీ మాస్టర్ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదే సమయంలో జనసేన పార్టీ వైస్ చైర్మన్ పదవి కూడా అందుకున్నారు. అనంతరం కృష్ణ గుంటూరు జిల్లాలలో పర్యటించి షేక్ జానీ మాస్టర్ తీవ్రస్థాయిలో వైసీపీ పై మండిపడటం జరిగింది. కాగా ఇప్పుడు హైపర్ ఆది జనసేన తరఫున ప్రచారానికి రెడీ అవుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!