Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత అరడజను సినిమాలను లైనప్ చేసుకున్న సంగతి తెలిసిం దే. వీటిలో ఇప్పటికే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు కూడా. ఈ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే. హిందీ, తమిళంలో వచ్చిన పింక్ సినిమా ఆధారంగా వకీల్ సాబ్ సినిమా వచ్చింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ హిట్ అందుకున్నారు. దీని తర్వాత భీమ్లా నాయక్ సినిమా వచ్చింది. ఈ సినిమా గత నెల 25వ తేదీన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ కూడా ఘన విజయాన్ని సాధించింది. అయితే, పవన్ నటించి హిట్స్ అందుకున్న ఈ రెండు సినిమాలు రీమేక్ అయిన సంగతి తెలిసిందే.
అయితే, పవన్ నెక్స్ట్ సినిమాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ముందుగా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడికల్ సినిమాను కంప్లీట్ చేసేలా కంటిన్యూగా డేట్స్ ఇచ్చారట. పవన్ డేట్స్ ఇవ్వాలే గానీ, క్రిష్ 30 నుంచి 40 రోజుల్లో బ్యాలెన్స్ షూట్ ఫినిష్ చేసేస్తారు. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే, దర్శకుడు హరీశ్ శంకర్ సినిమాకు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయట. ఒక్కసారి పీకే పక్కాగా డేట్స్ ఇస్తే భవదీయుడు భగత్సింగ్ కూడా ఫినిష్ చేసేస్తారు.
Pawan Kalyan: పూర్తి వివరాలు పవన్ టీమ్ నుంచి త్వరలో వెల్లడికానున్నాయి.
ఇక సురేందర్ రెడ్డి సినిమా ఒకటుంది. అలాగే, యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది రీమేక్ చేస్తారట. అలాగే, సముద్రఖని దర్శకత్వం వహించి నటించిన తమిళ హిట్ సినిమా వినోదాయ సితం కూడా పవన్ సొంత బ్యానర్లో రీమేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే, మరో మలయాళ చిత్రాన్ని పవన్ నిర్మించేందుకు రైట్స్ కొన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త కథలను ఎంచుకొని దాన్ని పూర్తిగా స్థాయిలో రెడీ చేసేకంటే ఇతర భాషలో హిట్ అయిన సినిమా రైట్స్ కొని రీమేక్ చేయడమే సేఫ్ అని పవన్ భావిస్తున్నారట. అందుకే, వరుసగా పరభాషా చిత్రాలను చూసి నచ్చి మన నేటివికీ మార్చగలమూ అనుకుంటే వెంటనే రైట్స్ కొంటున్నారట. ఈ ప్రాజెక్ట్స్కు సంబంధించిన పూర్తి వివరాలు పవన్ టీమ్ నుంచి త్వరలో వెల్లడికానున్నాయి