ఇప్పుడు లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉంది. త్వరలో ప్రారంబం కాబోయే నితిన్ సినిమాలో ఈమె నటించాల్సి ఉంది. కాగా ఇప్పుడు ఈమె మహేష్ సరసన నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా జూలై నుండి ప్రారంభం కానుంది. `దూకుడు` సీక్వెల్గా `వాట్స్ అప్` అనే పేరుతో సినిమా రూపొందనుందని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అందులో సాయిపల్లవి నటిస్తుందని వార్తలు వినిపించాయి. కాగా లెటెస్ట్ సమాచారం ప్రకారం మరో హీరోయిన్గా రష్మిక మందన్నా పేరు పరిశీలనలోఉందట. అయితే చేతినిండా సినిమాలతో ఖాలీ లేకుండా ఉన్న రష్మిక మహేష్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం `మహర్షి` సినిమాతో బిజీగా ఉన్న మహేష్ సమ్మర్ వెకేషన్ తర్వాత అనీల్ రావిపూడి సినిమాను స్టార్ట్ చేస్తాడు. అనీల్ సుంకరతో పాటు జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
previous post
next post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!